ETV Bharat / city

అమరావతిపై కేంద్రం మౌనంగా ఉండటం దుర్మార్గం: వర్ల

author img

By

Published : Oct 6, 2020, 7:01 PM IST

రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై కేంద్రం మౌనం పాటించటం దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. అమరావతి 300వ రోజు ఉద్యమ కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అమరావతిపై కేంద్రం మౌనంగా ఉండటం దుర్మార్గం: వర్ల
అమరావతిపై కేంద్రం మౌనంగా ఉండటం దుర్మార్గం: వర్ల

దిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానని పవిత్రస్థలాల నుంచి మట్టీ నీరు తెచ్చి ప్రధాని మాటిచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గుర్తు చేశారు. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రధానిపైనా, ఎన్డీయేపైనా ఉందని స్పష్టం చేశారు.

అమరావతిపై ఉన్న కొద్దిపాటి ఆశ కూడా పోయేలా జగన్ ఎన్డీయేలో చేరుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఏ మాత్రం తీసిపోని పోరాటం రైతులు చేస్తున్నారని.. అమరావతికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ మాత్రం రైతులకు అండగా ఉంటుందని వర్ల తేల్చి చెప్పారు.

దిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానని పవిత్రస్థలాల నుంచి మట్టీ నీరు తెచ్చి ప్రధాని మాటిచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గుర్తు చేశారు. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రధానిపైనా, ఎన్డీయేపైనా ఉందని స్పష్టం చేశారు.

అమరావతిపై ఉన్న కొద్దిపాటి ఆశ కూడా పోయేలా జగన్ ఎన్డీయేలో చేరుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఏ మాత్రం తీసిపోని పోరాటం రైతులు చేస్తున్నారని.. అమరావతికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ మాత్రం రైతులకు అండగా ఉంటుందని వర్ల తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.