తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముళ్లను దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మరో వ్యక్తి ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. హజారీగూడానికి చెందిన అన్నదమ్ములు సత్యనారాయణ, అంజి.. ఓ హత్య కేసులో నిందితులు. ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు.
రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి... హత్యచేశారు. అన్నదమ్ములది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి