విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదుగురి పర్సుల నుంచి రూ. 12 వేలకు పైగా నగదు, ఓ ప్రయాణికురాలు తన కూతురి కోసం కొన్న బంగారు చెవి దిద్దులు, అలాగే బీమవరం డిపోకు చెందిన బస్సు డ్రైవర్ టిమ్ మిషన్ను దొంగిలించారు. బస్టాండ్లోని పోలీసు అవుట్ ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని, ఫలితంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లమని.. ఉచిత సలహా ఇచ్చారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల తీరుతో విసిగిపోయిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయినప్పటికీ.. టిమ్ చోరీపై బస్ డ్రైవర్ కృష్ణలంక పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడచిన కొద్ది రోజులుగా బ్యాగులు,సెల్ ఫోన్లు చోరీలు జరుగుతుండడంతో భద్రతా చర్యలు పెంచాలని ప్రయాణికులు.. అధికారులను కోరారు. దొంగతనాల దృష్ట్యా బస్టాండ్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: