ETV Bharat / city

Balakrishna inaugurated Oxygen Plant: మరో వేరియంట్​ వచ్చినా మేం సిద్ధం: బాలయ్య

author img

By

Published : Dec 2, 2021, 3:50 PM IST

Balakrishna inaugurated Oxygen Plant: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సిజన్​ ప్లాంటును హైదరాబాద్​ బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రిలో.. ఛైర్మన్​ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కరోనాపై పోరులో ఆస్పత్రి ముందుంటోందని బాలకృష్ణ అన్నారు. మరో వేరియంట్​ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Balakrishna inaugurated Oxygen Plant
Balakrishna inaugurated Oxygen Plant

Balakrishna inaugurated Oxygen Plant: ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తూ... బసవతారకంలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి ఛైర్మన్‌, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సిజన్‌ ప్లాంటును బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ప్రత్యేక పూజలు చేశారు.

కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్న బాలకృష్ణ

కరోనాను అరికట్టడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించాం. ఆక్సిజన్​, మందులు, వెంటిలేటర్​ ఎలాంటి కొరత లేకుండా చూశాం. కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశాం. కొత్త వేరియంట్లు ఎదుర్కునేందుకు ఆస్పత్రి సిబ్బంది సన్నద్ధంగా ఉంది. -నందమూరి బాలకృష్ణ, బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రి ఛైర్మన్​

Oxygen plant in Basavatarakam hospital: రూ.1.2 కోట్ల విలువైన ఈ ప్లాంటును దిగ్గజ ఫార్మా సంస్థ నొవార్టిస్ సహాయంతో ఏర్పాటు చేశామని బాలకృష్ణ తెలిపారు. కొవిడ్​ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కొరత ఎదుర్కొన్నామని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

అయినప్పటికీ బసవతారకం ఆస్పత్రిలో మాత్రం రోగులకు.. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిత్యం ఆక్సిజన్​ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ ఆస్పత్రిని అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నామని బాలకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి:

ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం

Balakrishna inaugurated Oxygen Plant: ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తూ... బసవతారకంలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి ఛైర్మన్‌, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సిజన్‌ ప్లాంటును బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ప్రత్యేక పూజలు చేశారు.

కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్న బాలకృష్ణ

కరోనాను అరికట్టడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించాం. ఆక్సిజన్​, మందులు, వెంటిలేటర్​ ఎలాంటి కొరత లేకుండా చూశాం. కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశాం. కొత్త వేరియంట్లు ఎదుర్కునేందుకు ఆస్పత్రి సిబ్బంది సన్నద్ధంగా ఉంది. -నందమూరి బాలకృష్ణ, బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రి ఛైర్మన్​

Oxygen plant in Basavatarakam hospital: రూ.1.2 కోట్ల విలువైన ఈ ప్లాంటును దిగ్గజ ఫార్మా సంస్థ నొవార్టిస్ సహాయంతో ఏర్పాటు చేశామని బాలకృష్ణ తెలిపారు. కొవిడ్​ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కొరత ఎదుర్కొన్నామని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

అయినప్పటికీ బసవతారకం ఆస్పత్రిలో మాత్రం రోగులకు.. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిత్యం ఆక్సిజన్​ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ ఆస్పత్రిని అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నామని బాలకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి:

ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.