కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద అనుమతిలేని అంబులెన్సులను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారు. కొవిడ్ చికిత్సకు రోగులను తీసుకువచ్చే అంబులెన్సులు, వ్యక్తిగత వాహనాలకు.. అనుమతి తప్పనిసరి అన్న నిబంధన సరిహద్దుల్లో సమస్యాత్మకంగా మారింది.
ఇదీ చదవండి: తీవ్ర విషాదంలో పన్నీర్సెల్వం కుటుంబం
ఆస్పత్రి అపాయింట్మెంట్తో పాటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆథరైజేషన్ పాస్ తప్పనిసరి అని.. సూర్యాపేట ఎస్పీ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. వాటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోదని.. రెండూ ఖచ్చితంగా ఉండాల్సిందేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అనుమతి పత్రాలు పొందిన తర్వాతే.. చికిత్సకు బయలుదేరాలని సూచించారు. లేకుంటే సరిహద్దుల వద్ద ఇబ్బందులు తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: