ETV Bharat / city

ఉద్యోగమొచ్చినా... ఉపాధి పనే దిక్కు! - no posting for deputy tahsildars in telangana

గ్రూప్‌-2లో ఎంపికై డిప్యూటీ తహసీల్దారు ఉద్యోగానికి ఎంపికైనవారి కల పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం తప్ప పోస్టింగ్​లు రాక, ఉద్యోగం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉపాధిహామీ, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. మరికొందరు వ్యవసాయ పనులు చేస్తున్నారు.

telangana-deputy-tehsildar-candidates-are-waiting-for-posting
telangana-deputy-tehsildar-candidates-are-waiting-for-posting
author img

By

Published : Jun 11, 2020, 12:27 PM IST

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అరుణ డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికై పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆర్థిక అవసరాల నిమిత్తం అరుణ తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తున్నారు. ‘గ్రూప్‌-2 ఉద్యోగం నా కల. 2016 నుంచి పోరాడుతూనే ఉన్నా. గత ఏడాది డిసెంబరులో నియామక ఉత్తర్వు ఇచ్చారు. కొద్దిరోజులు శిక్షణ సైతం ఇచ్చారు. అంతే... ఏడు నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌ ఇవ్వలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్‌-2లో ఎంపికై డిప్యూటీ తహసీల్దారు ఉద్యోగానికి ఎంపికైనవారి కల పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం తప్ప రోజూవారీ కూలీ పనులు చేయనిదే పూట గడవడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు రూ.వేలు ఖర్చుచేసి ఉద్యోగ శిక్షణ పొందారు. 2016 నవంబరులో పరీక్ష రాశారు. ఎట్టకేలకు వారికి 2019 డిసెంబరులో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఫిబ్రవరిలో శిక్షణా ఇచ్చారు. పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు.

డీటీలుగా ఎంపికైన 259 మంది అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రూప్‌-2లో ఉద్యోగాలు పొందిన పలు కేటగిరీలకు చెందినవారికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. వాణిజ్యపన్నుల శాఖ, ఆబ్కారీ శాఖలకు ఎంపికైనవారు ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్నారు. డీటీలుగా ఎంపికైనవారు మాత్రం ఉద్యోగం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉపాధిహామీ, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. మరికొందరు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.

ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసినా..

డీటీలుగా ఎంపికైనవారిలో డిసెంబరుకి ముందు ఏదో ఒక ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు ఎంపీడీఓలు, 40 మంది ఉపాధ్యాయులు, 20 మంది ఎస్‌ఐలు, అయిదుగురు కానిస్టేబుళ్లు, 9 మంది అటవీశాఖ రేంజ్‌ అధికారులు, ఏడుగురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 20 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో పాటు ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్‌, ఉద్యాన శాఖ అధికారి, అయిదుగురు గ్రూప్‌-4 ఉద్యోగులు, విద్యుత్తుశాఖలో పనిచేసినవారు ఉన్నారు. వీరు డీటీలుగా ఎంపిక కావడంతో నియామక ఉత్తర్వులు అందుకొనేందుకు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కానీ, పోస్టింగులు లేక ప్రస్తుతం అవస్థలు పడుతున్నారు.

భవన నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఈయన పేరు ‌. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం జగ్గుతండా గ్రామానికి చెందిన హరిలాల్ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై కొద్ది రోజులు విధులు నిర్వర్తించారు. అనంతరం గ్రూప్‌-2 రాసి డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. గతేడాది డిసెంబరులో నియామక ఉత్తర్వు అందుకున్నారు. అప్పటినుంచి నేటి వరకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వలేదు.

‘నేను పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. మాకున్న పొలంలో పంటలు పండే పరిస్థితి లేదు. అందుకే ఎక్కడ పని దొరికితే అక్కడికి పోతున్నా. కనీసం రోజుకు రూ.350 వరకు వస్తే కుటుంబ అవసరాలు తీరుతాయి. ప్రభుత్వం వెంటనే పోస్టింగులు కల్పించి ఆదుకోవాలి’ అని హరిలాల్‌ కోరుతున్నారు.

ఇదీ చదవండి: అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అరుణ డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికై పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆర్థిక అవసరాల నిమిత్తం అరుణ తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తున్నారు. ‘గ్రూప్‌-2 ఉద్యోగం నా కల. 2016 నుంచి పోరాడుతూనే ఉన్నా. గత ఏడాది డిసెంబరులో నియామక ఉత్తర్వు ఇచ్చారు. కొద్దిరోజులు శిక్షణ సైతం ఇచ్చారు. అంతే... ఏడు నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌ ఇవ్వలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్‌-2లో ఎంపికై డిప్యూటీ తహసీల్దారు ఉద్యోగానికి ఎంపికైనవారి కల పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం తప్ప రోజూవారీ కూలీ పనులు చేయనిదే పూట గడవడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు రూ.వేలు ఖర్చుచేసి ఉద్యోగ శిక్షణ పొందారు. 2016 నవంబరులో పరీక్ష రాశారు. ఎట్టకేలకు వారికి 2019 డిసెంబరులో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఫిబ్రవరిలో శిక్షణా ఇచ్చారు. పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు.

డీటీలుగా ఎంపికైన 259 మంది అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రూప్‌-2లో ఉద్యోగాలు పొందిన పలు కేటగిరీలకు చెందినవారికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. వాణిజ్యపన్నుల శాఖ, ఆబ్కారీ శాఖలకు ఎంపికైనవారు ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్నారు. డీటీలుగా ఎంపికైనవారు మాత్రం ఉద్యోగం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉపాధిహామీ, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. మరికొందరు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.

ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసినా..

డీటీలుగా ఎంపికైనవారిలో డిసెంబరుకి ముందు ఏదో ఒక ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు ఎంపీడీఓలు, 40 మంది ఉపాధ్యాయులు, 20 మంది ఎస్‌ఐలు, అయిదుగురు కానిస్టేబుళ్లు, 9 మంది అటవీశాఖ రేంజ్‌ అధికారులు, ఏడుగురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 20 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో పాటు ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్‌, ఉద్యాన శాఖ అధికారి, అయిదుగురు గ్రూప్‌-4 ఉద్యోగులు, విద్యుత్తుశాఖలో పనిచేసినవారు ఉన్నారు. వీరు డీటీలుగా ఎంపిక కావడంతో నియామక ఉత్తర్వులు అందుకొనేందుకు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కానీ, పోస్టింగులు లేక ప్రస్తుతం అవస్థలు పడుతున్నారు.

భవన నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఈయన పేరు ‌. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం జగ్గుతండా గ్రామానికి చెందిన హరిలాల్ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై కొద్ది రోజులు విధులు నిర్వర్తించారు. అనంతరం గ్రూప్‌-2 రాసి డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. గతేడాది డిసెంబరులో నియామక ఉత్తర్వు అందుకున్నారు. అప్పటినుంచి నేటి వరకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వలేదు.

‘నేను పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. మాకున్న పొలంలో పంటలు పండే పరిస్థితి లేదు. అందుకే ఎక్కడ పని దొరికితే అక్కడికి పోతున్నా. కనీసం రోజుకు రూ.350 వరకు వస్తే కుటుంబ అవసరాలు తీరుతాయి. ప్రభుత్వం వెంటనే పోస్టింగులు కల్పించి ఆదుకోవాలి’ అని హరిలాల్‌ కోరుతున్నారు.

ఇదీ చదవండి: అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.