ETV Bharat / city

బీసీలను ఏం ఉద్ధరించారని సభ పెట్టారు : అచ్చెన్నాయుడు

author img

By

Published : Dec 18, 2020, 12:44 PM IST

జగన్​కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సంపద సృష్టి చేతకాని వైకాపా ప్రభుత్వం...జుట్టు మినహా అన్నింటిపైనా పన్నులు వేశారని ఆరోపించారు. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని చెప్తున్న ప్రభుత్వం...వేలాది మందితో బీసీ సంక్రాంతి సభ ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. బీసీలను ఏం ఉద్ధరించారని సభ పెట్టారని అచ్చెన్న మండిపడ్డారు.

Tdp state president
Tdp state president
బీసీలను ఏం ఉద్ధరించారని సభ పెట్టారు : అచ్చెన్నాయుడు

జగన్ గురించి తెలిసి కూడా ఓట్లు వేసినందుకు.. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తెదేపా హయాంలో అభివృద్ధి - సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలపై ఎలాంటి పన్ను వేయలేదని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చేతకానితనంతో సంపద సృష్టించటం తెలియక ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. జుట్టు మీద తప్ప అన్నింటిపైనా ప్రజలపై పన్నుల భారం మోపారని విమర్శించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఏలూరు వింత వ్యాధి ఘటనకు ఇంతవరకు మూలాలు కూడా చెప్పలేని అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. ఎన్నికలకు కరోనా కారణం చెప్తున్న సీఎం వేలాది మందితో బీసీ సంక్రాంతి సభ ఎలా నిర్వహించారని నిలదీశారు. బీసీలకు ఏం ఉద్ధరించారని బీసీల సభ పెట్టారని మండిపడ్డారు. బీసీలకు తీరని అన్యాయం చేశారనే దానిపై చర్చకు సిద్ధమా అని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.

జగన్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు పరిస్థితి చాలా దారుణంగా ఉందని అచ్చెన్న అన్నారు. తప్పు చేసే ప్రతి ఒక్కరి చిట్టా రాస్తున్నామన్న ఆయన... మళ్లీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అవసరాల కోసం పార్టీలు మారేవారికి ఈసారి తెలుగుదేశంలో చోటు ఉండదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎస్సీ వికలాంగులకు మోటార్ వాహనాలు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి : బీసీ సంక్రాంతి సభ మరో జగన్నాటకం: యనమల

బీసీలను ఏం ఉద్ధరించారని సభ పెట్టారు : అచ్చెన్నాయుడు

జగన్ గురించి తెలిసి కూడా ఓట్లు వేసినందుకు.. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తెదేపా హయాంలో అభివృద్ధి - సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలపై ఎలాంటి పన్ను వేయలేదని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చేతకానితనంతో సంపద సృష్టించటం తెలియక ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. జుట్టు మీద తప్ప అన్నింటిపైనా ప్రజలపై పన్నుల భారం మోపారని విమర్శించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఏలూరు వింత వ్యాధి ఘటనకు ఇంతవరకు మూలాలు కూడా చెప్పలేని అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. ఎన్నికలకు కరోనా కారణం చెప్తున్న సీఎం వేలాది మందితో బీసీ సంక్రాంతి సభ ఎలా నిర్వహించారని నిలదీశారు. బీసీలకు ఏం ఉద్ధరించారని బీసీల సభ పెట్టారని మండిపడ్డారు. బీసీలకు తీరని అన్యాయం చేశారనే దానిపై చర్చకు సిద్ధమా అని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.

జగన్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు పరిస్థితి చాలా దారుణంగా ఉందని అచ్చెన్న అన్నారు. తప్పు చేసే ప్రతి ఒక్కరి చిట్టా రాస్తున్నామన్న ఆయన... మళ్లీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అవసరాల కోసం పార్టీలు మారేవారికి ఈసారి తెలుగుదేశంలో చోటు ఉండదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎస్సీ వికలాంగులకు మోటార్ వాహనాలు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి : బీసీ సంక్రాంతి సభ మరో జగన్నాటకం: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.