ETV Bharat / city

అమరావతి రైతుల పాదయాత్ర విచ్ఛిన్నానికి.. ప్రభుత్వం కుట్ర: పిల్లి మాణిక్యరావు

author img

By

Published : Nov 3, 2021, 5:17 PM IST

అమరావతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు.. వైకాపా ప్రయత్నిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. పోలీసుల సాయంతో 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహాపాదయాత్రను విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

అమరావతి రైతుల పాదయాత్ర విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర
అమరావతి రైతుల పాదయాత్ర విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర

అమరావతి రైతుల 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహాపాదయాత్రను విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. అమరావతి ఉద్యమానికి పోటీగా.. ఎంపీ నందిగం సురేశ్ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని దుయ్యబట్టారు.

దానికి ప్రజాస్పందన లేకపోవటంతో.. ఈ రైతు ఉద్యమాన్ని అణిచేందుకు పోలీసుల సాయంతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ దుర్మార్గాలను ఎదురించి 700 రోజులుగా రైతులు కొనసాగిస్తున్న ఉద్యమాన్ని ఎలాగైనా నీరుగార్చాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పుడు చేపట్టిన పాదయాత్రను భగ్నం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

అమరావతి రైతుల 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహాపాదయాత్రను విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. అమరావతి ఉద్యమానికి పోటీగా.. ఎంపీ నందిగం సురేశ్ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని దుయ్యబట్టారు.

దానికి ప్రజాస్పందన లేకపోవటంతో.. ఈ రైతు ఉద్యమాన్ని అణిచేందుకు పోలీసుల సాయంతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ దుర్మార్గాలను ఎదురించి 700 రోజులుగా రైతులు కొనసాగిస్తున్న ఉద్యమాన్ని ఎలాగైనా నీరుగార్చాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పుడు చేపట్టిన పాదయాత్రను భగ్నం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి :

Mahapadayathra: మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.