ETV Bharat / city

కేసీఆర్​కు వైకాపా ప్రభుత్వం బినామీ: నిమ్మల

author img

By

Published : Sep 19, 2020, 3:34 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్​కు వైకాపా ప్రభుత్వం బినామీగా వ్యవహరిస్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్ర సంపద సృష్టి కేంద్రమైన అమరావతిపై వైకాపా ప్రభుత్వం ప్రతిరోజూ విషం కక్కుతూనే ఉందని ధ్వజమెత్తారు.

tdp leader nimmala ramanaidu comments on jagan
tdp leader nimmala ramanaidu comments on jagan

జగన్ తాడేపల్లిలో ఉంటున్న ఇంటిస్థలం కూడా రాజధాని ప్రకటన తరువాతే కొన్నారని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. అలా కొనడం నేరమైతే, జగన్ ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి ఇల్లు రమేశ్ బాబు అనే వ్యక్తి పేరుతో ఉందని.. ఆయన జగన్ కు చెందిన 25 కంపెనీల్లో బినామీగా ఉన్నారని ఆరోపించారు. జగన్​కు చెందిన సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్​కు 1600 ఎకరాలు కట్టబెట్టడం ఇన్​సైడ్ ట్రేడింగా.. లేక వన్ సైడ్ ట్రేడింగా అని నిలదీశారు.

108 వాహనాలపేరుతో రూ.300కోట్లు విజయసాయి రెడ్డికి కట్టబెట్టడం వన్ సైడ్ ట్రేడింగా? కాదా? అని నిమ్మల మండిపడ్డారు. మద్యం దుకాణాల ద్వారా 20 వేల కోట్లు కొట్టేస్తున్న జగన్, ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? లేక వన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

జగన్ తాడేపల్లిలో ఉంటున్న ఇంటిస్థలం కూడా రాజధాని ప్రకటన తరువాతే కొన్నారని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. అలా కొనడం నేరమైతే, జగన్ ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి ఇల్లు రమేశ్ బాబు అనే వ్యక్తి పేరుతో ఉందని.. ఆయన జగన్ కు చెందిన 25 కంపెనీల్లో బినామీగా ఉన్నారని ఆరోపించారు. జగన్​కు చెందిన సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్​కు 1600 ఎకరాలు కట్టబెట్టడం ఇన్​సైడ్ ట్రేడింగా.. లేక వన్ సైడ్ ట్రేడింగా అని నిలదీశారు.

108 వాహనాలపేరుతో రూ.300కోట్లు విజయసాయి రెడ్డికి కట్టబెట్టడం వన్ సైడ్ ట్రేడింగా? కాదా? అని నిమ్మల మండిపడ్డారు. మద్యం దుకాణాల ద్వారా 20 వేల కోట్లు కొట్టేస్తున్న జగన్, ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? లేక వన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.