ETV Bharat / city

ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?: నక్కా ఆనంద్ బాబు

author img

By

Published : Jun 2, 2021, 11:19 AM IST

ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లించడం పెద్ద నేరమని తెదేపా సీనియర్ నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ఏం కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లించడం పెద్ద నేరం: నక్కా ఆనందబాబు
ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లించడం పెద్ద నేరం: నక్కా ఆనందబాబు

వైకాపా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అందరికీ ఇచ్చే అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలు కాకుండా ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా అని నక్కా ఆనంద బాబు సవాల్ చేశారు. వైకాపా నుంచి గెలుపొందిన ఎస్సీ నేతలు దీనిపై చర్చకు రాలేకుంటే కనీసం చేసిందైనా చెప్పాలని డిమాండ్ చేశారు.

'దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టడం, శిరోముండనాలు, అవమానాలు, ఛీత్కారాలు, భూములు బలవంతంగా లాక్కోవటం తప్ప ఈ రెండేళ్లలో ఎస్సీలకు వైకాపా ప్రభుత్వం అదనంగా ఏం చేసింది? కేంద్రం ఇచ్చే ఉపకార వేతనాలను కూడా తినేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ఎస్సీలందరి పట్ల ఇష్టమొచ్చినట్లు చేస్తాం పడండి అన్నట్లు నిలువునా వంచించారు. ఎస్సీలతో పాటు ముస్లిం, మైనార్టీలకు ప్రభుత్వం అదనంగా ఏమీ చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక పథకాలన్నీ రద్దు చేశారు. నియంతృత్వ ధోరణితో ఎల్లకాలం కొనసాగుతామనుకోవటం భ్రమే. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. ఎస్సీలంతా తిరగబడేరోజు దగ్గరలోనే ఉంది' - నక్కా ఆనందబాబు

'తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులను 5ఏళ్లు సమర్థవంతంగా రూ.40వేల కోట్లు పైచిలుకు నిధులు ఖర్చు చేయటంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతో కృషి చేశాం. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులను అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆ నిధుల్ని కూడా మళ్లించటం నేరం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ రెండేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో సమాధానం చెప్పాలి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఎన్టీఆర్ విద్యోన్నతి, స్టడీ సర్కిళ్లు, అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి, కార్పొరేట్ విద్యను పేద విద్యార్థులకు అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లభించే కల్యాణ నిధి ఇలా ఎస్సీ, ఎస్టీలకు తెదేపా ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేశారు.' అని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో.. నేటి నుంచి విదేశీ విమాన సర్వీసులు

వైకాపా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అందరికీ ఇచ్చే అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలు కాకుండా ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా అని నక్కా ఆనంద బాబు సవాల్ చేశారు. వైకాపా నుంచి గెలుపొందిన ఎస్సీ నేతలు దీనిపై చర్చకు రాలేకుంటే కనీసం చేసిందైనా చెప్పాలని డిమాండ్ చేశారు.

'దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టడం, శిరోముండనాలు, అవమానాలు, ఛీత్కారాలు, భూములు బలవంతంగా లాక్కోవటం తప్ప ఈ రెండేళ్లలో ఎస్సీలకు వైకాపా ప్రభుత్వం అదనంగా ఏం చేసింది? కేంద్రం ఇచ్చే ఉపకార వేతనాలను కూడా తినేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ఎస్సీలందరి పట్ల ఇష్టమొచ్చినట్లు చేస్తాం పడండి అన్నట్లు నిలువునా వంచించారు. ఎస్సీలతో పాటు ముస్లిం, మైనార్టీలకు ప్రభుత్వం అదనంగా ఏమీ చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక పథకాలన్నీ రద్దు చేశారు. నియంతృత్వ ధోరణితో ఎల్లకాలం కొనసాగుతామనుకోవటం భ్రమే. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. ఎస్సీలంతా తిరగబడేరోజు దగ్గరలోనే ఉంది' - నక్కా ఆనందబాబు

'తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులను 5ఏళ్లు సమర్థవంతంగా రూ.40వేల కోట్లు పైచిలుకు నిధులు ఖర్చు చేయటంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతో కృషి చేశాం. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులను అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆ నిధుల్ని కూడా మళ్లించటం నేరం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ రెండేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో సమాధానం చెప్పాలి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఎన్టీఆర్ విద్యోన్నతి, స్టడీ సర్కిళ్లు, అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి, కార్పొరేట్ విద్యను పేద విద్యార్థులకు అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లభించే కల్యాణ నిధి ఇలా ఎస్సీ, ఎస్టీలకు తెదేపా ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేశారు.' అని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో.. నేటి నుంచి విదేశీ విమాన సర్వీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.