ETV Bharat / city

Request for protection: 'ఎంపీ సురేష్‌ నుంచి రక్షణ కల్పించండి'..ఎస్పీకి వినతిపత్రం - MP Nandigam Suresh

protection from MP Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ నుంచి ప్రాణహాని ఉందని.. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ బత్తుల బాబూరావు ఎస్పీని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనారోగ్యంతో మూడేళ్ల నుంచి విధులకు గైర్హాజరు కావటంతో ఉద్యోగం నుంచి తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకునేలా సాయం చేయాలని కోరితే.. ఎంపీ తనపైచేయి చేసుకున్నారని ఆవేదన చెందారు.

ఎస్పీకి వినతిపత్రం
ఎస్పీకి వినతిపత్రం
author img

By

Published : Dec 11, 2021, 10:39 AM IST

protection from MP Nandigam Suresh: అనారోగ్యంతో మూడేళ్ల నుంచి విధులకు గైర్హాజరు కావటంతో ఉద్యోగం నుంచి తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకునేలా సాయం చేయాలని కోరినందుకు వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ తనపై చేయిచేసుకుని, కులం పేరుతో దూషించారని డిస్మిస్‌ అయిన కానిస్టేబుల్‌ బత్తుల బాబూరావు ఆరోపించారు. దిల్లీలో ఉన్న ఆయనకు ఎస్‌ఎంఎస్‌ ఇచ్చి ఫోన్‌చేసి అడిగినందుకు దుర్భాషలాడారని వాపోయారు.ఈనెల 7న అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు తనను ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, ఎంపీతోపాటు ఆయన అనుచరులు, తుళ్లూరు ఎస్సై తనను కొట్టి, ఫోన్‌ లాగేసుకుని, అందులోని ఆడియో, వీడియో రికార్డులను తొలగించారని ఆరోపించారు. తనతో పాటు భార్య, కుమారుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారని, 8వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. ఎంపీ నుంచి ప్రాణహాని ఉందని శుక్రవారం గుంటూరు ఎస్పీని కలిశారు. మరోవైపు ఎంపీకి ఫోన్‌ చేసిన బాబూరావు ఇష్టానుసారం మాట్లాడారంటూ పీఏ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా తీసుకొచ్చామని, కొట్టలేదని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు చెప్పారు.

పదేపదే విసిగించాడు: ఎంపీ

ఆ వ్యక్తి పదేపదే ఫోన్లు చేస్తూ ఇబ్బందిపెట్టారు. నీకు ఏం సహాయం కావాలో అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు నాకు వాట్సప్‌ చేయండని అన్నాను. అయితే విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడటంతో ఫోన్‌ కట్‌ చేశా. అతను మరో నంబరు నుంచి ఫోన్‌ చేసి విసిగించాడు. ఈ ఆడియో రికార్డులో ఎవరి వద్ద పెట్టాలో పెడతానంటూ హెచ్చరించడంతో పోలీసులకు పీఏ ద్వారా ఫిర్యాదు చేయించా. అతను ఎవరో తెలుసుకోవడానికి పిలిపించా. అతడిని కొట్టలేదు

- నందిగం సురేష్, వైకాపా ఎంపీ

ఇదీచదవండి.

protection from MP Nandigam Suresh: అనారోగ్యంతో మూడేళ్ల నుంచి విధులకు గైర్హాజరు కావటంతో ఉద్యోగం నుంచి తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకునేలా సాయం చేయాలని కోరినందుకు వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ తనపై చేయిచేసుకుని, కులం పేరుతో దూషించారని డిస్మిస్‌ అయిన కానిస్టేబుల్‌ బత్తుల బాబూరావు ఆరోపించారు. దిల్లీలో ఉన్న ఆయనకు ఎస్‌ఎంఎస్‌ ఇచ్చి ఫోన్‌చేసి అడిగినందుకు దుర్భాషలాడారని వాపోయారు.ఈనెల 7న అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు తనను ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, ఎంపీతోపాటు ఆయన అనుచరులు, తుళ్లూరు ఎస్సై తనను కొట్టి, ఫోన్‌ లాగేసుకుని, అందులోని ఆడియో, వీడియో రికార్డులను తొలగించారని ఆరోపించారు. తనతో పాటు భార్య, కుమారుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారని, 8వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. ఎంపీ నుంచి ప్రాణహాని ఉందని శుక్రవారం గుంటూరు ఎస్పీని కలిశారు. మరోవైపు ఎంపీకి ఫోన్‌ చేసిన బాబూరావు ఇష్టానుసారం మాట్లాడారంటూ పీఏ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా తీసుకొచ్చామని, కొట్టలేదని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు చెప్పారు.

పదేపదే విసిగించాడు: ఎంపీ

ఆ వ్యక్తి పదేపదే ఫోన్లు చేస్తూ ఇబ్బందిపెట్టారు. నీకు ఏం సహాయం కావాలో అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు నాకు వాట్సప్‌ చేయండని అన్నాను. అయితే విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడటంతో ఫోన్‌ కట్‌ చేశా. అతను మరో నంబరు నుంచి ఫోన్‌ చేసి విసిగించాడు. ఈ ఆడియో రికార్డులో ఎవరి వద్ద పెట్టాలో పెడతానంటూ హెచ్చరించడంతో పోలీసులకు పీఏ ద్వారా ఫిర్యాదు చేయించా. అతను ఎవరో తెలుసుకోవడానికి పిలిపించా. అతడిని కొట్టలేదు

- నందిగం సురేష్, వైకాపా ఎంపీ

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.