నవంబర్ 26న కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర్య ఉద్యోగ ఫెడరేషన్లు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాయని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సమ్మెకు రైతు, కౌలురైతు, వ్యవసాయు ఇతర ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు.
కరోనాతో ఉపాధి కోల్పోయిన కుటుంబానికి నెలకు 7,500 చొప్పున ఐదు నెలలు నగదు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలని.. కీలక రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని చెప్పారు. భవన నిర్మాణ, ఆటో, ప్రైవేటు ట్రాన్స్ పోర్టు, హమాలీ తదితర అన్ని రంగాల అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి, భద్రతతో సమగ్ర చట్టం చేయాలని చెప్పారు.
ఇదీ చదవండి: