ETV Bharat / city

Power employees protest: రాష్ట్ర వ్యాప్తంగా.. విద్యుత్ ఉద్యోగులు నిరసన

author img

By

Published : Feb 9, 2022, 5:01 PM IST

Updated : Feb 9, 2022, 5:10 PM IST

Power employees protest: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ, జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.

statewide Power employees protest
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసనలు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ, జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.


నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో..
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని జెన్​కో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆందోళన చేపట్టింది. ప్రకాశం జిల్లా చీరాలలోనూ విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

తూర్పుగోదావరిలో..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రామచంద్రాపురం సబ్-డివిజన్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌ జనరేటరీలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లాలో..
విజయనగరం విద్యుత్ భవనం దగ్గర.. భోజనం విరామం సమయంలో నిరసన చేపట్టారు. దామోదర సంజీవయ్య విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ.. ఐకాస విద్యుత్తు ఉద్యోగుల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో.. కార్మికులు నిరసన చేపట్టారు. దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ, జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.


నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో..
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని జెన్​కో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆందోళన చేపట్టింది. ప్రకాశం జిల్లా చీరాలలోనూ విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

తూర్పుగోదావరిలో..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రామచంద్రాపురం సబ్-డివిజన్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌ జనరేటరీలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లాలో..
విజయనగరం విద్యుత్ భవనం దగ్గర.. భోజనం విరామం సమయంలో నిరసన చేపట్టారు. దామోదర సంజీవయ్య విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ.. ఐకాస విద్యుత్తు ఉద్యోగుల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో.. కార్మికులు నిరసన చేపట్టారు. దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?

Last Updated : Feb 9, 2022, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.