ETV Bharat / city

'అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి' - విజయవాడలో అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటు

విజయవాడ స్వరాజ్ మైదాన్​లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని జైభీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి ఏడాది గడిచినా...విగ్రహ ఏర్పాటుకు ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు.

sravan kumar demand on ambedkar statue at swaraj maidan
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి
author img

By

Published : Apr 16, 2021, 7:49 PM IST

విజయవాడ స్వరాజ్ మైదాన్​లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని గతేడాది ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని జైభీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏడాదిలోపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తామన్న ప్రభుత్వం..10 నెలలు గడిచినా ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. తక్షణమే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించినందుకు తమపై కేసు పెట్టడం ప్రభుత్వ కుటిలయత్నానికి నిదర్శనమన్నారు. సీఐని కులం పేరుతో దూషించామని తమపై అన్యాయంగా పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

విజయవాడ స్వరాజ్ మైదాన్​లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని గతేడాది ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని జైభీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏడాదిలోపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తామన్న ప్రభుత్వం..10 నెలలు గడిచినా ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. తక్షణమే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించినందుకు తమపై కేసు పెట్టడం ప్రభుత్వ కుటిలయత్నానికి నిదర్శనమన్నారు. సీఐని కులం పేరుతో దూషించామని తమపై అన్యాయంగా పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఇదీచదవండి

పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలపై నిర్ణయం: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.