ETV Bharat / city

RAHUL MURDER CASE:నా కుమారుడి హత్యలో వారికి భాగం: రాహుల్ తండ్రి రాఘవరావు

author img

By

Published : Aug 21, 2021, 3:46 PM IST

Updated : Aug 21, 2021, 5:12 PM IST

Vijayawada industrialist Rahul murder case
Vijayawada industrialist Rahul murder case

15:31 August 21

Vijayawada industrialist Rahul murder case

డబ్బు కోసం తన కుమారుడిపై విజయ్ అనే వ్యక్తి.. తీవ్రమైన ఒత్తిడి చేశారని పారిశ్రామికవేత్త రాహుల్ తండ్రి రాఘువరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వాటా కోసం విజయ్ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. వాటా కూడా కొనుగోలు చేయాలని రాహుల్‌ను విజయ్‌ కోరారని తెలిపారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలు చర్చలు జరిగాయని ఫిర్యాదులో ప్రస్తావించారు. తక్కువ ధరకు అడగడం వల్లే సత్యంకు ఫ్యాక్టరీ అమ్మలేదని రాఘవరావు స్పష్టం చేశారు. రాహుల్‌ ఉదంతంలో కోరాడ కుటుంబసభ్యులకు భాగం ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసి కోరాడ ఆర్థికంగా నష్టపోయాడని వివరించారు.

రాహుల్ హత్య.. ఆ రోజు ఏం జరిగింది?

విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం గురువారం కలకలం రేపింది. దర్యాప్తులో హతుడు పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) అని తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, భోరున విలపించారు.

ఇదీ చదవండి:

Viveka Murder Case: సీబీఐ రివార్డు.. ఏ మూలకు సరిపోతుంది?: ఎంపీ రఘురామ

15:31 August 21

Vijayawada industrialist Rahul murder case

డబ్బు కోసం తన కుమారుడిపై విజయ్ అనే వ్యక్తి.. తీవ్రమైన ఒత్తిడి చేశారని పారిశ్రామికవేత్త రాహుల్ తండ్రి రాఘువరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వాటా కోసం విజయ్ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. వాటా కూడా కొనుగోలు చేయాలని రాహుల్‌ను విజయ్‌ కోరారని తెలిపారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలు చర్చలు జరిగాయని ఫిర్యాదులో ప్రస్తావించారు. తక్కువ ధరకు అడగడం వల్లే సత్యంకు ఫ్యాక్టరీ అమ్మలేదని రాఘవరావు స్పష్టం చేశారు. రాహుల్‌ ఉదంతంలో కోరాడ కుటుంబసభ్యులకు భాగం ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసి కోరాడ ఆర్థికంగా నష్టపోయాడని వివరించారు.

రాహుల్ హత్య.. ఆ రోజు ఏం జరిగింది?

విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం గురువారం కలకలం రేపింది. దర్యాప్తులో హతుడు పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) అని తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, భోరున విలపించారు.

ఇదీ చదవండి:

Viveka Murder Case: సీబీఐ రివార్డు.. ఏ మూలకు సరిపోతుంది?: ఎంపీ రఘురామ

Last Updated : Aug 21, 2021, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.