ETV Bharat / city

Omicron Cases: రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

author img

By

Published : Jan 4, 2022, 9:14 PM IST

Updated : Jan 4, 2022, 10:03 PM IST

రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

21:08 January 04

రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 24కి చేరుకుంది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో ఒమన్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్‌ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్‌, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..

ap corona cases: మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 334 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో భారీగా కరోనా కేసులు..

India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Vaccination in India: దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 99,27,797 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 13లక్షల 32వేల 854 కేసులు వెలుగులోకి వచ్చాయి. 2,952 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి

AP Corona Cases: కొత్తగా 334 కరోనా కేసులు.. ఒకరు మృతి

21:08 January 04

రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 24కి చేరుకుంది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో ఒమన్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్‌ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్‌, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..

ap corona cases: మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 334 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో భారీగా కరోనా కేసులు..

India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Vaccination in India: దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 99,27,797 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 13లక్షల 32వేల 854 కేసులు వెలుగులోకి వచ్చాయి. 2,952 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి

AP Corona Cases: కొత్తగా 334 కరోనా కేసులు.. ఒకరు మృతి

Last Updated : Jan 4, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.