ETV Bharat / city

'పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం'

author img

By

Published : Feb 13, 2021, 7:32 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే.. మాచర్ల, పుంగనూరులో నూరుశాతం ఏకగ్రీవాలు జరిగేవి కావని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలమైందని ఆక్షేపించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. పలుచోట్ల తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచినా..వైకాపా మద్దతుదారులు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఎస్​ఈసీ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, పోలీసుల సాయంతోనే ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని ఆక్షేపించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే..మాచర్ల, పుంగనూరులో నూరుశాతం ఏకగ్రీవాలు జరిగేవి కావన్నారు. ఎస్ఈసీ సీరియస్​గా వ్యవహరించలేదు కాబట్టే అధికారులు వైకాపా ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. మూడు, నాలుగో విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలైనా..ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. పలుచోట్ల తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచినా..వైకాపా మద్దతుదారులు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఎస్​ఈసీ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, పోలీసుల సాయంతోనే ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని ఆక్షేపించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే..మాచర్ల, పుంగనూరులో నూరుశాతం ఏకగ్రీవాలు జరిగేవి కావన్నారు. ఎస్ఈసీ సీరియస్​గా వ్యవహరించలేదు కాబట్టే అధికారులు వైకాపా ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. మూడు, నాలుగో విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలైనా..ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

ఇదీచదవండి

మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్‌ఈసీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.