ETV Bharat / city

రైతు బజార్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి - mla vishnu

విజయవాడలో పాఠశాల మైదానాలు, నగర పాలక సంస్థ, క్రీడా మైదానాల్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లను మంత్రి వెల్లంపల్లి , ఎమ్మెల్యే విష్ణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి కోరారు.

krishna district
రైతు బజార్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి
author img

By

Published : Mar 26, 2020, 4:12 PM IST

రైతు బజార్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి

రాష్ట్రంలో లాక్​డౌన్ అమలు అవుతున్న పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు రైతు బజార్లలో అందుబాటులో ఉంచారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రైతు బజార్లను మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్లలో కూరగాయల విక్రయాలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలింకగా టెంట్లు వేసేలా కలెక్టర్​తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలెవరూ నిత్యావసరాల కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రేషన్ బియ్యం, కందిపప్పు వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎతం చేస్తున్నా సామాన్య ప్రజల నుంచి సహకారం లేకపోతే....కరోనా కట్టడి సాధ్యం కాదన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు.

రైతు బజార్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి

రాష్ట్రంలో లాక్​డౌన్ అమలు అవుతున్న పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు రైతు బజార్లలో అందుబాటులో ఉంచారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రైతు బజార్లను మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్లలో కూరగాయల విక్రయాలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలింకగా టెంట్లు వేసేలా కలెక్టర్​తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలెవరూ నిత్యావసరాల కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రేషన్ బియ్యం, కందిపప్పు వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎతం చేస్తున్నా సామాన్య ప్రజల నుంచి సహకారం లేకపోతే....కరోనా కట్టడి సాధ్యం కాదన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు.

ఇదీ చూడండి:

రైతు బజార్లలో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.