ETV Bharat / city

జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై.. విచారణ వాయిదా

author img

By

Published : May 26, 2021, 11:24 AM IST

Updated : May 26, 2021, 12:21 PM IST

సీఎం జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై విచారణ వాయిదా
సీఎం జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై విచారణ వాయిదా

11:22 May 26

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు గడువును మరోసారి సీఎం జగన్​తోపాటు సీబీఐ కోరింది. లాక్‌డౌన్‌తో కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని.. జగన్ తరఫు న్యాయవాది సీబీఐ కోర్టుకు తెలిపారు. మెయిల్ ద్వారా కౌంటర్‌ను సమర్పించవచ్చని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేష్ వాదనలు వినిపించారు.

ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గడువు పెంచవద్దని, జరిమానా విధించాలని కోరారు. సీబీఐ ఎందుకు కౌంటర్ వేయట్లేదో అర్థం కావట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐకి చివరి అవకాశాన్ని కోర్టు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్‌ 1కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌

11:22 May 26

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు గడువును మరోసారి సీఎం జగన్​తోపాటు సీబీఐ కోరింది. లాక్‌డౌన్‌తో కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని.. జగన్ తరఫు న్యాయవాది సీబీఐ కోర్టుకు తెలిపారు. మెయిల్ ద్వారా కౌంటర్‌ను సమర్పించవచ్చని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేష్ వాదనలు వినిపించారు.

ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గడువు పెంచవద్దని, జరిమానా విధించాలని కోరారు. సీబీఐ ఎందుకు కౌంటర్ వేయట్లేదో అర్థం కావట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐకి చివరి అవకాశాన్ని కోర్టు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్‌ 1కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌

Last Updated : May 26, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.