జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 17న వేయాల్సిన పోలియో వ్యాక్సిన్ను తదుపరి తేదీ ప్రకటించే వరకు వాయిదా వేసినట్టు జాతీయ ఇమ్యూనైజేషన్ పథకం సలహాదారు ప్రదీప్ హల్డర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. ఈ నెల 16న కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి తొలివిడత పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందున ఈ కార్యక్రమం వాయిదా వేసినట్టు కేంద్రం ప్రకటించింది.
ఇదీ చూడండి: