ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్​ సైన్స్​ ఒకేషనల్​ కోర్సులు

కంప్యూటర్​ సైన్స్​కు సంబంధించి ఒకేషనల్​ కోర్సులను తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా విజయవాడలోని కేబీఎన్​ కళాశాలు ప్రారంభించింది. ఐటీ సర్వీసెస్​లో UGC గుర్తింపు వచ్చిన కోర్సులు మాత్రమే ప్రవేశపెడుతున్నట్టు కళాశాల యాజమాన్యం తెలిపింది.

author img

By

Published : May 3, 2019, 1:17 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్​ సైన్స్​ ఒకేషనల్​ కోర్సులు
తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్​ సైన్స్​ ఒకేషనల్​ కోర్సులు

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా... కంప్యూటర్ సైన్స్​కు సంబంధించి ఒకేషనల్ కోర్సులు ప్రారంభిస్తున్న తొలి కళాశాల తమదేనని విజయవాడ కేబీఎన్ కళాశాల కరెస్పాండెంట్, సెక్రటరీ టి.శ్రీనివాస్ తెలిపారు. వెబ్ టెక్నాలజీ, సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్, ఐటీ సర్వీసెస్ లో UGC గుర్తింపు వచ్చిన వొకేషనల్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్​లో లెక్కలను ఒక సబ్జెక్టుగా చదివిన విద్యార్థులు.. ఈ కోర్సు చేసేందుకు అర్హులని వెల్లడించారు. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్​ కోర్సు చేయడం వల్ల విద్యార్థులకు మొదటి సంవత్సరంలో డిప్లమా, రెండో ఏడాది అడ్వాన్స్​డ్​ డిప్లమా, మూడో ఏడాది పూర్తి చేసిన వారికి డిగ్రీ పట్టా ఇవ్వనున్నట్లు వివరించారు. డిప్లమా పూర్తి చేసిన వెంటనే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని, మొదటి సంవత్సం పూర్తి చేసిన తర్వాత... విద్యార్థుల అనుకూలతను బట్టి మిగిలిన రెండు సంవత్సరాలను ఎప్పుడైనా పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందని కెబిఎన్ కళాశాల అకడమిక్స్ డైరెక్టర్ పి.ఎల్ రమేష్ తెలిపారు. పరిమితమైన సీట్లలోనే ప్రస్తుతం విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపిన యాజమాన్యం.. వచ్చే ఏడాది మరికొన్ని సీట్లు పెంచుతామని వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్​ సైన్స్​ ఒకేషనల్​ కోర్సులు

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా... కంప్యూటర్ సైన్స్​కు సంబంధించి ఒకేషనల్ కోర్సులు ప్రారంభిస్తున్న తొలి కళాశాల తమదేనని విజయవాడ కేబీఎన్ కళాశాల కరెస్పాండెంట్, సెక్రటరీ టి.శ్రీనివాస్ తెలిపారు. వెబ్ టెక్నాలజీ, సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్, ఐటీ సర్వీసెస్ లో UGC గుర్తింపు వచ్చిన వొకేషనల్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్​లో లెక్కలను ఒక సబ్జెక్టుగా చదివిన విద్యార్థులు.. ఈ కోర్సు చేసేందుకు అర్హులని వెల్లడించారు. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్​ కోర్సు చేయడం వల్ల విద్యార్థులకు మొదటి సంవత్సరంలో డిప్లమా, రెండో ఏడాది అడ్వాన్స్​డ్​ డిప్లమా, మూడో ఏడాది పూర్తి చేసిన వారికి డిగ్రీ పట్టా ఇవ్వనున్నట్లు వివరించారు. డిప్లమా పూర్తి చేసిన వెంటనే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని, మొదటి సంవత్సం పూర్తి చేసిన తర్వాత... విద్యార్థుల అనుకూలతను బట్టి మిగిలిన రెండు సంవత్సరాలను ఎప్పుడైనా పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందని కెబిఎన్ కళాశాల అకడమిక్స్ డైరెక్టర్ పి.ఎల్ రమేష్ తెలిపారు. పరిమితమైన సీట్లలోనే ప్రస్తుతం విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపిన యాజమాన్యం.. వచ్చే ఏడాది మరికొన్ని సీట్లు పెంచుతామని వెల్లడించింది.

ఇదీ చదవండీ :

ఫొని తుపాను బాధితులను ఆదుకోండి: చంద్రబాబు

Intro:రైలు ఢీ కొని 170 గొర్రెలు, ఒక కాపరి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. నరసరావుపేట పట్టణ శివారులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం ఉమ్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నాగం తిరుపతయ్య(35) అనే గొర్రెల కాపరి తన గొర్రెల మందను తొలుకుంటూ గుంటూరు రోడ్డు నుంచి బైపాస్ రోడ్డుకు చేరేందుకు ఆ మార్గంలోని రైలు పట్టాలు దాటించే క్రమంలో గొర్రెలన్నీ గుంపుగా వెళ్తున్నాయి. అదే సమయంలో విజయవాడ నుంచి హుబ్లీ వెళ్లే రైలు వస్తోందని గమనించిన కాపరి వెంటనే గొర్రెలన్నింటినీ తోలి కాపాడే ప్రయత్నం చేశాడు. అప్పటికే వేగంగా వస్తున్న రైలు కాపరితో సహా గొర్రెలని ఢీ కొంటూ వెళ్ళింది.


Body:ఈ క్రమంలో గొర్రెల కాపరి నాగం తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సుమారు 170 గొర్రెలు చెల్లాచెదురుగా పడి మృతి చెందాయి. వీటి ఖరీదు సుమారు 15 లక్షలు ఉండవచ్చని తోటి కాపరులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయం తెలుసుకున్నారు. తిరుపతయ్య మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Conclusion:కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో మృతుని భార్య, బంధువులు తిరుపతయ్య మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గొర్రెల మంద మేతకు ఊరుగానీవురు వచ్చి మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళావయ్యా అంటూ మృతుని భార్య బాల గురవమ్మ రోధిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. మృతునికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నట్లుగా బంధువులు తెలిపారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.