ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 175 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

author img

By

Published : Mar 13, 2021, 5:33 PM IST

Updated : Mar 13, 2021, 8:08 PM IST

రాష్ట్రంలో కొత్తగా 175 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి ఇద్దరు మృతిచెందారు. ఫలితంగా ఇప్పటి వరకునమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,563కి చేరింది.

ap corona updates
రాష్ట్రంలో కొత్తగా 175 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,448 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,91,563కి చేరింది. కొవిడ్‌ కారణంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కోక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,182కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో132 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,113కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,89,098 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరిలో 31, కృష్ణాలో 24 మందికి కొవిడ్ పాజిటివ్​గా ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,448 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,91,563కి చేరింది. కొవిడ్‌ కారణంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కోక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,182కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో132 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,113కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,89,098 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరిలో 31, కృష్ణాలో 24 మందికి కొవిడ్ పాజిటివ్​గా ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి:

భారత్​లో ఒక్కరోజే 24 వేల 882 కరోనా కేసులు

Last Updated : Mar 13, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.