ETV Bharat / city

ఎస్​ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

author img

By

Published : Apr 1, 2021, 10:00 AM IST

Updated : Apr 1, 2021, 12:04 PM IST

ap sec Neelam Sahni
ఎస్​ఈసీ నూతన కమిషనర్‌ నీలం సాహ్ని
ఎస్​ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

ప్రభుత్వం, ప్రజల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌ నీలం సాహ్ని అన్నారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఎస్​ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఎన్నికల కమిషనర్​గా సాహ్ని గుర్తింపు పొందారు. తనపై విశ్వాసంతో ఎస్​ఈసీగా ఎంపిక చేసిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నూతన ఎస్​ఈసీకి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగియడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గవర్నర్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ముఖ్యమంత్రి‌ జగన్‌ ముఖ్య సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్​

ఎస్​ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

ప్రభుత్వం, ప్రజల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌ నీలం సాహ్ని అన్నారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఎస్​ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఎన్నికల కమిషనర్​గా సాహ్ని గుర్తింపు పొందారు. తనపై విశ్వాసంతో ఎస్​ఈసీగా ఎంపిక చేసిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నూతన ఎస్​ఈసీకి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగియడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గవర్నర్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ముఖ్యమంత్రి‌ జగన్‌ ముఖ్య సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్​

Last Updated : Apr 1, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.