ETV Bharat / city

ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ

author img

By

Published : Feb 6, 2020, 10:33 AM IST

(ఏపీ రూరల్‌ ఇంక్యూలెన్స్‌ గ్రోత్‌ ప్రాజెక్ట్) ఏపీఆర్‌ఐజీపీ పథకాన్ని మరో అయిదేళ్లపాటు రాష్ట్రంలో కొనసాగించేందుకు ప్రపంచబ్యాంక్​ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో విజయవాడలో భేటీ అయ్యారు.

ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ
ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ

విజయవాడలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్​) ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం కింద చేస్తున్న పనులపై సెర్ప్​ సీఈవో రాజాబాబు ఇచ్చిన నివేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఆర్‌ఐజీపీ పథకాన్ని మరో అయిదేళ్లపాటు రాష్ట్రంలో కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఆఫీస్, ఇన్ పుట్ షాప్​లను ఏర్పాటు చేసి, వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలపై సమీక్షించారు. నేషనల్ లెవెల్ ఎస్​పీవో వర్క్ షాప్​లను ఏర్పాటు చేసి ఈ ప్రగతిని దేశ వ్యాప్తంగా తెలియజేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.

విజయవాడలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్​) ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం కింద చేస్తున్న పనులపై సెర్ప్​ సీఈవో రాజాబాబు ఇచ్చిన నివేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఆర్‌ఐజీపీ పథకాన్ని మరో అయిదేళ్లపాటు రాష్ట్రంలో కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఆఫీస్, ఇన్ పుట్ షాప్​లను ఏర్పాటు చేసి, వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలపై సమీక్షించారు. నేషనల్ లెవెల్ ఎస్​పీవో వర్క్ షాప్​లను ఏర్పాటు చేసి ఈ ప్రగతిని దేశ వ్యాప్తంగా తెలియజేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.

ఇదీ చూడండి: మంత్రి మేకపాటితో ఫ్రెంచి ప్రతినిధులు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.