ETV Bharat / city

రెండేళ్లలోనే మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చాం: బొత్స

author img

By

Published : May 28, 2021, 10:51 PM IST

రెండేళ్ల పాలనలోనే ముఖ్యమంత్రి జగన్.. మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

bosta
bosta

రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రెండేళ్ల పాలనలో మేనిఫెస్టోలోని అన్ని హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్​కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. మహానాడు వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు.. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం తన హయాంలో 69 వేల కోట్లు ఖర్చుచేశానని చెబుతున్న ఆయన.. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా పాలనంతా దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని , 14 ఏళ్లుగా సీఎంగా ఉండి ఏం చేశారని నిలదీశారు.

రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రెండేళ్ల పాలనలో మేనిఫెస్టోలోని అన్ని హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్​కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. మహానాడు వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు.. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం తన హయాంలో 69 వేల కోట్లు ఖర్చుచేశానని చెబుతున్న ఆయన.. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా పాలనంతా దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని , 14 ఏళ్లుగా సీఎంగా ఉండి ఏం చేశారని నిలదీశారు.

ఇదీ చదవండి: సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.