ETV Bharat / city

పంచాయతీ పోరుకు సిద్ధమైన విజయవాడ శివారు ప్రాంతాలు

రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు.. కృష్ణా జిల్లా విజయవాడ శివారు ప్రాంతాలు సిద్ధమయ్యాయి. దీంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా.. 9న జరిగే తొలి విడత పోలింగ్​కు సర్వం సిద్ధం చేశారు. పేరుకు గ్రామాలే అయినప్పటికీ.. అక్కడంతా బహుళ అంతస్తులతో నగర వాతావరణం తలపిస్తుంది.

author img

By

Published : Feb 5, 2021, 7:22 PM IST

Krishna district Vijayawada suburbs ready for panchayat elections
పంచాయతీ పోరుకు సిద్ధమైన విజయవాడ శివారు ప్రాంతాలు

అవి పేరుకు పల్లెలు.. కానీ నగర వాతావరణం కనిపిస్తుంది. మధ్యతరగతి ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరువృత్తులు చేసేవారు ఎక్కువ. బహుళ అంతస్తులతో కాంక్రీట్‌ జంగిల్‌లా ఉంటాయి. ఎప్పటినుంచో నగరంలో విలీనం కావాల్సిన గ్రామాలు. రాజకీయ కారణాలతో ఆగిపోయాయి. రాజధానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడలో శివారు గ్రామాల పట్టణీకరణ వేగంగా జరిగింది. ప్రస్తుతం విజయవాడ శివారు పంచాయతీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒక పంచాయతీ ఏకగ్రీవం అయింది. తొలి విడతలోనే ఈ పంచాయతీలకు 9న పోలింగ్‌ జరగనుంది.

విడదీయలేని అనుబంధం..!

ఏలూరు రహదారిలో ఉండే రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, బందరు రహదారిలో ఉండే పెనమలూరు, పోరంకి, కానూరు, హైదరాబాద్‌ రహదారిలో ఉండే గొల్లపూడి, గుంటుపల్లి ప్రాంతాలను నగరంలో అంతర్భాగంగానే చాలామంది భావిస్తారు. మొత్తం 29 పంచాయతీలను విలీనం చేసి గ్రేటర్‌ విజయవాడగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. దీనికి విరుద్ధంగా యనమలకుదురు, కానూరు, పోరంకి, తాడిగడపలను కలిపి వైఎస్సార్‌ తాడిగడప పురపాలక సంఘం ఏర్పాటు చేశారు. గొల్లపూడి పంచాయతీని విభజించి గొల్లపూడి, వైఎస్సార్‌నగర్‌, రామరాజ్యనగర్‌, జక్కంపూడి పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ 8 పంచాయతీలకు ఎన్నికలు లేవు. 9 పంచాయతీలు గన్నవరం పరిధిలో ఉన్నాయి. అక్కడ మారిన రాజకీయ సమీకరణాలు ఎవరికి మద్దతుగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

రామవరప్పాడు(బీసీ మహిళ): ఓటర్లు 19,213. గతంలో కాంగ్రెస్‌ గెలిచింది. ఇక్కడ వైకాపా మద్దతుదారులు ఇద్దరు పోటీలో ఉన్నారు. జనసేన మద్దతుదారులు పోటీ చేస్తున్నారు. తెదేపా సానుభూతిపరులు నామపత్రం వేయలేదు.

ప్రసాదంపాడు(బీసీ మహిళ): ఓటర్లు 15,646. గతంలో తెదేపా సానుభూతులు గెలుచుకున్నారు. ప్రస్తుతం తెదేపా వైకాపా కలిసి ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించాయి. తెదేపా 10 వార్డుల్లో ఏకగ్రీవం అయింది. సర్పంచి పదవికి గంగారత్నం పేరు ప్రతిపాదించాయి. వైకాపాలో గంగాజ్యోతి నామపత్రం వేశారు. ఉపసంహరణకు ససేమిరా అన్నారు. దీంతో పోటీ అనివార్యం అయింది. గతంలో తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కొమ్మా కోట్లు ప్రస్తుతం వైకాపా తరఫున చక్రం తిప్పుతున్నారు.

ఎనికేపాడు(జనరల్‌): ఓటర్లు 9,459. గతంలో తెదేపా సిట్టింగ్‌ స్థానం. ఆ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం. తెదేపా తరఫున వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. మరో అభ్యర్థి ఉన్నారు. తెదేపా, వైకాపా, భాజపా

మద్దతుదారులు రంగంలో ఉన్నారు.

నిడమానూరు(ఎస్సీ, జనరల్‌): ఓటర్లు 8,780. గతంలో తెదేపా సిట్టింగ్‌. ప్రస్తుతం ఇద్దరు వైకాపా తరఫున పోటీలో ఉన్నారు. తెదేపా గట్టి పోటీ ఇస్తోంది.

నున్న(ఎస్సీ మహిళ): 12,598 మంది ఓటర్లు. గతంలో కాంగ్రెస్‌, తెదేపా సంయుక్తంగా గెలుచుకున్నాయి. ప్రస్తుతం వైకాపాలోని యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వంశీ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. తెదేపా గట్టిపోటీ ఇస్తోంది.

గూడవల్లి(జనరల్‌ మహిళ): వైకాపా సర్పంచి. ఎంపీటీసీ తెదేపాకు ఇచ్చేందుకు ఒప్పందం.

  • పాతపాడు(జనరల్‌ మహిళ), అంబాపురం (జనరల్‌), నైనవరం(జనరల్‌) పంచాయతీల్లో తెదేపా, వైకాపా బరిలో ఉన్నాయి. నైనవరంలో సీపీఎం గతంలో గెలుచుకుంది. ఈసారి గట్టిపోటీ ఇస్తోంది. ఈ పంచాయతీల్లో 3వేల లోపు ఓట్లు ఉన్నాయి. వైకాపాలో వర్గపోరు ఉంది.

మైలవరం పరిధిలో..!

గుంటుపల్లి (ఎస్టీ మహిళ): ఓటర్లు 9,900. తెదేపా సిట్టింగ్‌. ప్రస్తుతం తెదేపా- వైకాపా మధ్య నువ్వానేనా అన్న పోరు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిష్ఠాత్మకం. స్వయంగా పర్యవేక్షణ. వైకాపాలో వర్గ పోరు ఉంది.

  • కొత్తూరు తాడేపల్లి(బీసీ జనరల్‌), రాయనపాడు (జనరల్‌ మహిళ), పైడూరుపాడు(జనరల్‌) చిన్న పంచాయతీలు ఉన్నాయి. వీటిలోనూ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ సీపీఎం కూడా గట్టి పోటీ ఉంది. రాయనపాడులో తెదేపా వైకాపా మధ్య పోటీ. ఈ ప్రాంతాల్లో ఇసుక, మట్టి అక్రమ తరలింపు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

పెనమలూరు పరిధిలో..!

పెనమలూరు(బీసీ, జనరల్‌): ఓటర్లు 12,129. గతంలో తెదేపా సిట్టింగ్‌. ప్రస్తుతం వైకాపా, తెదేపా, బీఎస్పీ మద్ధతుదారులు పోటీలో ఉన్నారు. వైకాపాలో వర్గపోరు ఉంది. మాజీ జడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షుడు మధ్య విభేదాలు.

  • పెదపులిపాక(జనరల్‌), చోడవరం(జనరల్‌) స్థానాల్లోనూ పోటీ ఆసక్తికరం. గతంలో పెదపులిపాక వైకాపా, చోడవరం తెదేపాలకు సిట్టింగ్‌ స్థానాలు. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పోటీ ఉంది. తెదేపాకు పట్టు ఉన్న ప్రాంతాలు.

ఈ సారి ఎన్నికల్లో శివారు పంచాయతీల్లో పలు అంశాలు ప్రభావితం కానున్నాయి. చెత్త నిలువ కేంద్రాలు లేవు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. . మంచినీటి సరఫరా నామమాత్రం.

ఇదీ చదవండి:

కేంద్ర బడ్జెట్​పై అఖిలపక్ష పార్టీల సమావేశం

అవి పేరుకు పల్లెలు.. కానీ నగర వాతావరణం కనిపిస్తుంది. మధ్యతరగతి ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరువృత్తులు చేసేవారు ఎక్కువ. బహుళ అంతస్తులతో కాంక్రీట్‌ జంగిల్‌లా ఉంటాయి. ఎప్పటినుంచో నగరంలో విలీనం కావాల్సిన గ్రామాలు. రాజకీయ కారణాలతో ఆగిపోయాయి. రాజధానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడలో శివారు గ్రామాల పట్టణీకరణ వేగంగా జరిగింది. ప్రస్తుతం విజయవాడ శివారు పంచాయతీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒక పంచాయతీ ఏకగ్రీవం అయింది. తొలి విడతలోనే ఈ పంచాయతీలకు 9న పోలింగ్‌ జరగనుంది.

విడదీయలేని అనుబంధం..!

ఏలూరు రహదారిలో ఉండే రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, బందరు రహదారిలో ఉండే పెనమలూరు, పోరంకి, కానూరు, హైదరాబాద్‌ రహదారిలో ఉండే గొల్లపూడి, గుంటుపల్లి ప్రాంతాలను నగరంలో అంతర్భాగంగానే చాలామంది భావిస్తారు. మొత్తం 29 పంచాయతీలను విలీనం చేసి గ్రేటర్‌ విజయవాడగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. దీనికి విరుద్ధంగా యనమలకుదురు, కానూరు, పోరంకి, తాడిగడపలను కలిపి వైఎస్సార్‌ తాడిగడప పురపాలక సంఘం ఏర్పాటు చేశారు. గొల్లపూడి పంచాయతీని విభజించి గొల్లపూడి, వైఎస్సార్‌నగర్‌, రామరాజ్యనగర్‌, జక్కంపూడి పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ 8 పంచాయతీలకు ఎన్నికలు లేవు. 9 పంచాయతీలు గన్నవరం పరిధిలో ఉన్నాయి. అక్కడ మారిన రాజకీయ సమీకరణాలు ఎవరికి మద్దతుగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

రామవరప్పాడు(బీసీ మహిళ): ఓటర్లు 19,213. గతంలో కాంగ్రెస్‌ గెలిచింది. ఇక్కడ వైకాపా మద్దతుదారులు ఇద్దరు పోటీలో ఉన్నారు. జనసేన మద్దతుదారులు పోటీ చేస్తున్నారు. తెదేపా సానుభూతిపరులు నామపత్రం వేయలేదు.

ప్రసాదంపాడు(బీసీ మహిళ): ఓటర్లు 15,646. గతంలో తెదేపా సానుభూతులు గెలుచుకున్నారు. ప్రస్తుతం తెదేపా వైకాపా కలిసి ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించాయి. తెదేపా 10 వార్డుల్లో ఏకగ్రీవం అయింది. సర్పంచి పదవికి గంగారత్నం పేరు ప్రతిపాదించాయి. వైకాపాలో గంగాజ్యోతి నామపత్రం వేశారు. ఉపసంహరణకు ససేమిరా అన్నారు. దీంతో పోటీ అనివార్యం అయింది. గతంలో తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కొమ్మా కోట్లు ప్రస్తుతం వైకాపా తరఫున చక్రం తిప్పుతున్నారు.

ఎనికేపాడు(జనరల్‌): ఓటర్లు 9,459. గతంలో తెదేపా సిట్టింగ్‌ స్థానం. ఆ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం. తెదేపా తరఫున వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. మరో అభ్యర్థి ఉన్నారు. తెదేపా, వైకాపా, భాజపా

మద్దతుదారులు రంగంలో ఉన్నారు.

నిడమానూరు(ఎస్సీ, జనరల్‌): ఓటర్లు 8,780. గతంలో తెదేపా సిట్టింగ్‌. ప్రస్తుతం ఇద్దరు వైకాపా తరఫున పోటీలో ఉన్నారు. తెదేపా గట్టి పోటీ ఇస్తోంది.

నున్న(ఎస్సీ మహిళ): 12,598 మంది ఓటర్లు. గతంలో కాంగ్రెస్‌, తెదేపా సంయుక్తంగా గెలుచుకున్నాయి. ప్రస్తుతం వైకాపాలోని యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వంశీ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. తెదేపా గట్టిపోటీ ఇస్తోంది.

గూడవల్లి(జనరల్‌ మహిళ): వైకాపా సర్పంచి. ఎంపీటీసీ తెదేపాకు ఇచ్చేందుకు ఒప్పందం.

  • పాతపాడు(జనరల్‌ మహిళ), అంబాపురం (జనరల్‌), నైనవరం(జనరల్‌) పంచాయతీల్లో తెదేపా, వైకాపా బరిలో ఉన్నాయి. నైనవరంలో సీపీఎం గతంలో గెలుచుకుంది. ఈసారి గట్టిపోటీ ఇస్తోంది. ఈ పంచాయతీల్లో 3వేల లోపు ఓట్లు ఉన్నాయి. వైకాపాలో వర్గపోరు ఉంది.

మైలవరం పరిధిలో..!

గుంటుపల్లి (ఎస్టీ మహిళ): ఓటర్లు 9,900. తెదేపా సిట్టింగ్‌. ప్రస్తుతం తెదేపా- వైకాపా మధ్య నువ్వానేనా అన్న పోరు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిష్ఠాత్మకం. స్వయంగా పర్యవేక్షణ. వైకాపాలో వర్గ పోరు ఉంది.

  • కొత్తూరు తాడేపల్లి(బీసీ జనరల్‌), రాయనపాడు (జనరల్‌ మహిళ), పైడూరుపాడు(జనరల్‌) చిన్న పంచాయతీలు ఉన్నాయి. వీటిలోనూ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ సీపీఎం కూడా గట్టి పోటీ ఉంది. రాయనపాడులో తెదేపా వైకాపా మధ్య పోటీ. ఈ ప్రాంతాల్లో ఇసుక, మట్టి అక్రమ తరలింపు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

పెనమలూరు పరిధిలో..!

పెనమలూరు(బీసీ, జనరల్‌): ఓటర్లు 12,129. గతంలో తెదేపా సిట్టింగ్‌. ప్రస్తుతం వైకాపా, తెదేపా, బీఎస్పీ మద్ధతుదారులు పోటీలో ఉన్నారు. వైకాపాలో వర్గపోరు ఉంది. మాజీ జడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షుడు మధ్య విభేదాలు.

  • పెదపులిపాక(జనరల్‌), చోడవరం(జనరల్‌) స్థానాల్లోనూ పోటీ ఆసక్తికరం. గతంలో పెదపులిపాక వైకాపా, చోడవరం తెదేపాలకు సిట్టింగ్‌ స్థానాలు. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పోటీ ఉంది. తెదేపాకు పట్టు ఉన్న ప్రాంతాలు.

ఈ సారి ఎన్నికల్లో శివారు పంచాయతీల్లో పలు అంశాలు ప్రభావితం కానున్నాయి. చెత్త నిలువ కేంద్రాలు లేవు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. . మంచినీటి సరఫరా నామమాత్రం.

ఇదీ చదవండి:

కేంద్ర బడ్జెట్​పై అఖిలపక్ష పార్టీల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.