ETV Bharat / city

మున్సిపల్, మండల కేంద్రాల్లో శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలు: కలెక్టర్ ఇంతియాజ్

author img

By

Published : May 7, 2021, 8:39 PM IST

కృష్ణా జిల్లాలోని అన్ని మున్సిపల్, మండల కేంద్రాల్లో శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ కరోనా టీకా ప్రక్రియను కొనసాగించాలని సూచించారు.

krishna district collector inthiaz
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల పరిధిలో నాలుగు నుంచి ఐదు శాశ్వత వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రాలలో వీటి ఏర్పాటుపై ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, ఆడిటోరియంలలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వాక్సినేషన్ కేంద్రాల వద్ద కొవీషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా వివరాలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు.. గుర్తించిన శాశ్వత వాక్సినేషన్ కేంద్రాల వివరాలను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి, కలెక్టర్​కు నివేదిక అందించాలన్నారు. వాటిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా భద్రతా కార్యదర్శి విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వాహనంలో కూర్చునే టీకా.. ఎక్కడంటే?

మూడు రకాల టోకెన్లు...

కొవిడ్ బాధితులను రెడ్, గ్రీన్, బ్లూ అనే 3 వర్గాలుగా గుర్తించి వాక్సినేషన్ చేపడతామని కలెక్టర్ తెలిపారు. 'రెడ్ టోకెన్' ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్​లైన్ వారియర్స్​కు, 'గ్రీన్ టోకెన్' 60 ఏళ్లు నిండిన వయో వృద్ధులకు, 'బ్లూ టోకెన్' 45 ఏళ్లు దాటిన రోగులకు జారీ చేయాలన్నారు. ఆయా కేంద్రాల పరిధిలో టీకాల డిమాండ్​కు తగినట్లుగా టోకెన్లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఓ రిజిస్టరు నిర్వహిస్తూ.. వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వాటిని అందించాలన్నారు. సచివాలయాల స్టాంపుతో పాటు ఒక రోజు ముందు మాత్రమే వాటిని బాధితులకు ఇవ్వాలన్నారు. ఫ్రంట్ల్​లైన్ వర్కర్స్​కు సంబంధిత శాఖాధికారులు టోకెన్లు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

బాధ్యత వారిదే...

టోకెన్ల జారీ విషయంలో ఏమైనా తప్పులు జరిగితే.. ఆయా సచివాలయాల వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, వార్డు కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 500 మంది ఉన్న నమోదు కేంద్రం వద్ద ఓ ఈడీపీఎస్ అధికారి, ముగ్గురు వాలంటీర్లు ఉండాలని.. అంతకు మించిన చోట్ల ఇద్దరు ఈడీపీఎస్ అధికారులు, నలుగురు వాలంటీర్లు సేవలు అందించాలని ఆదేశించారు. మొదటి డోస్ అనంతరం రెండో డోస్ వివరాలు, వ్యాక్సిన్ పేరుతో కూడిన పింక్ స్లిప్​ల జారీకి మరో ఆరుగురు వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ సక్రమంగా నిర్వహించేందుకు ఇద్దరు చొప్పున వైద్యులు, ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

జార్ఖండ్ సీఎం ట్వీట్​.. మోదీకి మద్దతుగా జగన్ రిప్లై!

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల పరిధిలో నాలుగు నుంచి ఐదు శాశ్వత వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రాలలో వీటి ఏర్పాటుపై ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, ఆడిటోరియంలలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వాక్సినేషన్ కేంద్రాల వద్ద కొవీషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా వివరాలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు.. గుర్తించిన శాశ్వత వాక్సినేషన్ కేంద్రాల వివరాలను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి, కలెక్టర్​కు నివేదిక అందించాలన్నారు. వాటిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా భద్రతా కార్యదర్శి విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వాహనంలో కూర్చునే టీకా.. ఎక్కడంటే?

మూడు రకాల టోకెన్లు...

కొవిడ్ బాధితులను రెడ్, గ్రీన్, బ్లూ అనే 3 వర్గాలుగా గుర్తించి వాక్సినేషన్ చేపడతామని కలెక్టర్ తెలిపారు. 'రెడ్ టోకెన్' ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్​లైన్ వారియర్స్​కు, 'గ్రీన్ టోకెన్' 60 ఏళ్లు నిండిన వయో వృద్ధులకు, 'బ్లూ టోకెన్' 45 ఏళ్లు దాటిన రోగులకు జారీ చేయాలన్నారు. ఆయా కేంద్రాల పరిధిలో టీకాల డిమాండ్​కు తగినట్లుగా టోకెన్లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఓ రిజిస్టరు నిర్వహిస్తూ.. వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వాటిని అందించాలన్నారు. సచివాలయాల స్టాంపుతో పాటు ఒక రోజు ముందు మాత్రమే వాటిని బాధితులకు ఇవ్వాలన్నారు. ఫ్రంట్ల్​లైన్ వర్కర్స్​కు సంబంధిత శాఖాధికారులు టోకెన్లు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

బాధ్యత వారిదే...

టోకెన్ల జారీ విషయంలో ఏమైనా తప్పులు జరిగితే.. ఆయా సచివాలయాల వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, వార్డు కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 500 మంది ఉన్న నమోదు కేంద్రం వద్ద ఓ ఈడీపీఎస్ అధికారి, ముగ్గురు వాలంటీర్లు ఉండాలని.. అంతకు మించిన చోట్ల ఇద్దరు ఈడీపీఎస్ అధికారులు, నలుగురు వాలంటీర్లు సేవలు అందించాలని ఆదేశించారు. మొదటి డోస్ అనంతరం రెండో డోస్ వివరాలు, వ్యాక్సిన్ పేరుతో కూడిన పింక్ స్లిప్​ల జారీకి మరో ఆరుగురు వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ సక్రమంగా నిర్వహించేందుకు ఇద్దరు చొప్పున వైద్యులు, ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

జార్ఖండ్ సీఎం ట్వీట్​.. మోదీకి మద్దతుగా జగన్ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.