ETV Bharat / city

రోడ్లపై కొవిడ్‌ అనుమానితుల సంచారం

author img

By

Published : May 10, 2021, 10:17 AM IST

కరోనా వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగింది. విజయవాడలోని ఒక్కొ కేంద్రంలో రోజుకు 300 నుంచి 500 మంది వరకు స్వాబ్​ను సేకరించి ల్యాబ్​లకు పంపుతున్నారు. వీటిని నిర్ధారించేందుకు కొన్ని రోజుల సమయం పడుతోంది. అయితే నమూనాలను ఇచ్చిన వారు ఫలితాలు వచ్చే వరకు రోడ్లపై తిరుగుతున్నారు.

రోడ్లపై కొవిడ్‌ అనుమానితుల సంచారం
రోడ్లపై కొవిడ్‌ అనుమానితుల సంచారం

కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. విజయవాడలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం, ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం, మరో 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 300 నుంచి 500 మంది వరకు నమూనాను (స్వాబ్‌ను) సేకరించి, ల్యాబ్‌లకు పంపుతున్నారు. వీటిని నిర్ధారించేందుకు కొన్ని రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నమూనాలను ఇచ్చిన వారు ఫలితాలు వచ్చే వరకు సహజంగా వివిధ అవసరాల నిమిత్తం రోడ్లపై తిరుగుతున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఇలానే బయటకు వస్తున్నారని, ఇది వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై అనుమానితులు అవగాహన పెంచుకుని, నిర్ధారణ పరీక్షల నివేదిక వచ్చే వరకు స్వీయ నియంత్రణ పాటించడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు నగరంలో, జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత నెలకొంది. ఇలాంటి హాట్‌ స్పాట్‌లను గుర్తించి, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు.

అవగాహనతోనే ఆక్సిజన్‌ సమస్యకు పరిష్కారం

ప్రాణ వాయువు ఎవరికి అవసరమనే విషయమై అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. ఆక్సిజన్‌ 96 శాతం ఉన్న వారికి ఇది అవసరం లేకపోయినా, వారిలో ఆందోళన నెలకొన్న కారణంగా ముందుగా వచ్చిన రోగికి ప్రాణ వాయువు ఇవ్వాల్సి వస్తోంది. ఇదే తరుణంలో ఆక్సిజన్‌ 70 శాతానికి పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండి, వెనుక వచ్చిన వారికి లభించని పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్‌తో కూడిన పడకలో వైద్యం పొందిన వారు కోలుకున్న అనంతరం డిశ్ఛార్జ్‌ అయినా, పలు ప్రైవేటు ఆసుపత్రుల వారు సదరు పడకలను ఖాళీగా చూపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పడకలపై ఉన్న రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేసే తరుణంలో వృథాను అరికట్టడం మరో ఘట్టం. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎ.ఎన్‌.ఎం.ల వద్ద ఆక్సీ మీటర్లను అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నారు. దీంతో ప్రాథమికంగా ఎవరికి ఆక్సిజన్‌ అవసరమో నిర్ధారించవచ్ఛు వెరసి ఆక్సిజన్‌ను జిల్లాకు రప్పించడం ఎంత ముఖ్యమో, దీన్ని అవసరాలకు సరిపడా వినియోగించడం అంతే ముఖ్యంగా ఉంది. అందుబాటులో ఆక్సిజన్‌ లేకుంటే, దేహంలో ప్రాణ వాయువు వృద్ధికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి ద్వారా 10 శాతం ఆక్సిజన్‌ వృద్ధి చెందుతుందని వైద్య రంగంలోని వారి సలహా.

ఆ ఉద్యోగులను అటూ.. ఇటూ తిప్పేకంటే..

నగరంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలను చేయడానికి నమూనాలను సేకరించే ఉద్యోగుల్లో కొందరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఇతర అవసరాల నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్య సిబ్బంది నగరానికి వచ్చి వెళుతున్నారు. నూజివీడు, గన్నవరం, నందిగామ నియోజకవర్గాలు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు వైద్య సిబ్బంది నిత్యం ఆయా ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని ఇలా అటూ, ఇటూ తిప్పేకంటే, స్థానికంగా ఉన్న సిబ్బందికే విధులను అప్పగిస్తే వైరస్‌ వ్యాప్తిని నివారించే వీలుందని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి ఈ పాస్​ విధానం అమలు: డీజీపీ

కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. విజయవాడలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం, ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం, మరో 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 300 నుంచి 500 మంది వరకు నమూనాను (స్వాబ్‌ను) సేకరించి, ల్యాబ్‌లకు పంపుతున్నారు. వీటిని నిర్ధారించేందుకు కొన్ని రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నమూనాలను ఇచ్చిన వారు ఫలితాలు వచ్చే వరకు సహజంగా వివిధ అవసరాల నిమిత్తం రోడ్లపై తిరుగుతున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఇలానే బయటకు వస్తున్నారని, ఇది వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై అనుమానితులు అవగాహన పెంచుకుని, నిర్ధారణ పరీక్షల నివేదిక వచ్చే వరకు స్వీయ నియంత్రణ పాటించడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు నగరంలో, జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత నెలకొంది. ఇలాంటి హాట్‌ స్పాట్‌లను గుర్తించి, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు.

అవగాహనతోనే ఆక్సిజన్‌ సమస్యకు పరిష్కారం

ప్రాణ వాయువు ఎవరికి అవసరమనే విషయమై అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. ఆక్సిజన్‌ 96 శాతం ఉన్న వారికి ఇది అవసరం లేకపోయినా, వారిలో ఆందోళన నెలకొన్న కారణంగా ముందుగా వచ్చిన రోగికి ప్రాణ వాయువు ఇవ్వాల్సి వస్తోంది. ఇదే తరుణంలో ఆక్సిజన్‌ 70 శాతానికి పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండి, వెనుక వచ్చిన వారికి లభించని పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్‌తో కూడిన పడకలో వైద్యం పొందిన వారు కోలుకున్న అనంతరం డిశ్ఛార్జ్‌ అయినా, పలు ప్రైవేటు ఆసుపత్రుల వారు సదరు పడకలను ఖాళీగా చూపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పడకలపై ఉన్న రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేసే తరుణంలో వృథాను అరికట్టడం మరో ఘట్టం. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎ.ఎన్‌.ఎం.ల వద్ద ఆక్సీ మీటర్లను అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నారు. దీంతో ప్రాథమికంగా ఎవరికి ఆక్సిజన్‌ అవసరమో నిర్ధారించవచ్ఛు వెరసి ఆక్సిజన్‌ను జిల్లాకు రప్పించడం ఎంత ముఖ్యమో, దీన్ని అవసరాలకు సరిపడా వినియోగించడం అంతే ముఖ్యంగా ఉంది. అందుబాటులో ఆక్సిజన్‌ లేకుంటే, దేహంలో ప్రాణ వాయువు వృద్ధికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి ద్వారా 10 శాతం ఆక్సిజన్‌ వృద్ధి చెందుతుందని వైద్య రంగంలోని వారి సలహా.

ఆ ఉద్యోగులను అటూ.. ఇటూ తిప్పేకంటే..

నగరంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలను చేయడానికి నమూనాలను సేకరించే ఉద్యోగుల్లో కొందరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఇతర అవసరాల నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్య సిబ్బంది నగరానికి వచ్చి వెళుతున్నారు. నూజివీడు, గన్నవరం, నందిగామ నియోజకవర్గాలు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు వైద్య సిబ్బంది నిత్యం ఆయా ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని ఇలా అటూ, ఇటూ తిప్పేకంటే, స్థానికంగా ఉన్న సిబ్బందికే విధులను అప్పగిస్తే వైరస్‌ వ్యాప్తిని నివారించే వీలుందని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి ఈ పాస్​ విధానం అమలు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.