రాజధాని విషయంలో ప్రభుత్వం తొందరపడింది: కామినేని శ్రీనివాస్
By
Published : Feb 2, 2020, 1:11 PM IST
రాజధాని విషయంలో ప్రభుత్వం చాలా తొందరపాటు నిర్ణయం తీసుకుందని భాజపా నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి రైతు సంఘాల నాయకులతో చేపట్టిన చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బిల్లును సెలక్టు కమిటీకి పంపించి శాసనమండలి సరైన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.