ETV Bharat / city

వివేకా హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు: హైకోర్టు

author img

By

Published : Mar 20, 2020, 6:01 AM IST

వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సాక్ష్యాల్ని కాపాడటంలో అలసత్వం వహించారని మండిపడింది. విచారణ క్రమం, ఇంతవరకు హత్యకేసుతో సంబంధం ఉన్న ఒకర్నీ అరెస్టు చేయకపోవడంపై అనుమానం వెలిబుచ్చింది. తన చిన్నాన్నను హత్యచేసిన నేరగాళ్లకు శిక్షపడేలా చూడాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌కు ఉందని స్పష్టం చేసింది.

వివేకా హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు: హైకోర్టు
వివేకా హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు: హైకోర్టు

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో లోపాల్ని హైకోర్టు ఎత్తిచూపింది. విచారణను సీబీఐకి అప్పగించిన రోజున... దర్యాప్తు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరయ్య , హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ఘటనాస్థలిలో ఆధారాలు చెరిగిపోకుండా, మృతదేహాన్ని కదల్చకుండా చూడాల్సింది పోయి... కొందరి స్వార్థ ప్రయోజనం కోసం స్నానాల గది నుంచి పడక గదికి మృతదేహం మార్చడమేంటని ప్రశ్నించింది. శరీరంపై రక్తాన్ని తుడిచి బ్యాండేజ్ వేశారని, హత్యాస్థలిలో రక్తపుమడుగును పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా... ముఖ్యమైన సాక్ష్యాల్ని చెరిపేశారని మండిపడింది. మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించాక శవ పంచనామా నిర్వహించడాన్ని తప్పుబట్టింది. నేరం జరిగిన చోట శవపంచనామా నిర్వహించాలని, క్లూస్‌టీం ఆధారాలు సేకరించాలని..., కానీ కొందరు స్వార్థపరులు ఉద్దేశపూర్వకంగా కీలక సాక్ష్యాల్ని కనబడనీయకుండా చేశారని హైకోర్టు పేర్కొంది.

వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన విషయం హైకోర్టు ప్రస్తావించింది. శవపంచనామా నిర్వహించాకే ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసుగా మార్చారని పేర్కొంది. తన మృతికి డ్రైవర్ ప్రసాదే కారణమంటూ వివేకా రాసినట్లు కనుగొన్న లేఖ గురించి న్యాయమూర్తి ప్రస్తావించారు. విధులకు త్వరగా రమ్మన్నందుకు డ్రైవర్ తీవ్రంగా కొట్టాడని లేఖలో ఉందని గుర్తుచేశారు. అందులోని చేతిరాత మృతుడిదేనని మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నిపుణులు తేల్చారన్నారు. అయితే రెండో అభిప్రాయం కోసం లేఖను హైదరాబాద్‌ సీఎఫ్​ఎస్​ఎల్​కు పంపారన్నారు. డ్రైవర్ ప్రసాద్ ఇప్పటికీ వివేకా కుటుంబసభ్యుల వద్దే పనిచేస్తుండటం, ఆయనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయకపోవడం చూస్తుంటే... హత్యకు కారణమైనవారే కేసును పక్కదోవ పట్టించేందుకు మృతుడితో బలవంతంగా లేఖ రాయించి ఉండొచ్చని కోర్టు సందేహం వ్యక్తంచేసింది.

ఆర్థిక, వ్యక్తిగత, రాజకీయ సంబంధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని, పలువుర్ని విచారించామని సిట్ చెబుతున్నప్పటికీ... ఇప్పటి వరకు ఘటనతో నేరుగా సంబంధం ఉన్న ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడింది. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న కె.శ్రీనివాసరెడ్డి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక గుట్టు రట్టు కాకుండా తప్పించారా అనే విషయం వెల్లడికావాల్సి ఉందని న్యాయమూర్తి అన్నారు. హత్యకేసు విచారణకు అదనపు డీజీ అమిత్‌గార్గ్‌ సారథ్యంలో మొదటి సిట్ ఏర్పాటుచేయగా.... కడప ఎస్పీ నేతృత్వంలో రెండో సిట్ నియమించిన విషయం హైకోర్టు ప్రస్తావించింది. మొదటి సిట్‌కి సారథ్యం వహించిన అదనపు డీజీకి.... రెండో సిట్‌లో స్థానం కల్పించలేదుని గుర్తుచేసింది. 2019 అక్టోబర్ 16న కడప ఎస్పీ 8 పోలీసు బృందాల్ని ఏర్పాటుచేశారని... అయినా ఇప్పటివరకు హత్య కేసు మిస్టరీ మాత్రం వీడలేదని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

నేరగాళ్లకు శిక్షపడేలా చూడాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మృతుడు వివేకానందరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి చిన్నాన్న అనే విషయం ప్రస్తావించింది. హత్య జరిగిన కొన్ని రోజులకే సీబీఐకి దర్యాప్తు అప్పగించాలంటూ ప్రతిపక్షనేతగా జగన్‌ వ్యాజ్యం దాఖలు చేశారని..ఆ వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదంటూ ముఖ్యమంత్రిగా కోర్టులో మెమో వేశారని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు దుర్వినియోగం కాదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ... ఈ వ్యవహారం తుదిదశకు చేరేవరకు నైతిక బాధ్యతను వదులుకోరాదని అభిప్రాయం వ్యక్తంచేసింది. కోర్టులో మెమో వేసే నాటికి రాష్ట్ర దర్యాప్తు ఏజెన్సీ ముఖ్యమంత్రి నియంత్రణలో ఉన్నప్పటికీ.... హత్య కేసులో నేరుగా పాత్ర ఉన్న ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదన్నది కఠోర సత్యమని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: వైఎస్​ వివేకానందరెడ్డికి ఘన నివాళి

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో లోపాల్ని హైకోర్టు ఎత్తిచూపింది. విచారణను సీబీఐకి అప్పగించిన రోజున... దర్యాప్తు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరయ్య , హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ఘటనాస్థలిలో ఆధారాలు చెరిగిపోకుండా, మృతదేహాన్ని కదల్చకుండా చూడాల్సింది పోయి... కొందరి స్వార్థ ప్రయోజనం కోసం స్నానాల గది నుంచి పడక గదికి మృతదేహం మార్చడమేంటని ప్రశ్నించింది. శరీరంపై రక్తాన్ని తుడిచి బ్యాండేజ్ వేశారని, హత్యాస్థలిలో రక్తపుమడుగును పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా... ముఖ్యమైన సాక్ష్యాల్ని చెరిపేశారని మండిపడింది. మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించాక శవ పంచనామా నిర్వహించడాన్ని తప్పుబట్టింది. నేరం జరిగిన చోట శవపంచనామా నిర్వహించాలని, క్లూస్‌టీం ఆధారాలు సేకరించాలని..., కానీ కొందరు స్వార్థపరులు ఉద్దేశపూర్వకంగా కీలక సాక్ష్యాల్ని కనబడనీయకుండా చేశారని హైకోర్టు పేర్కొంది.

వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన విషయం హైకోర్టు ప్రస్తావించింది. శవపంచనామా నిర్వహించాకే ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసుగా మార్చారని పేర్కొంది. తన మృతికి డ్రైవర్ ప్రసాదే కారణమంటూ వివేకా రాసినట్లు కనుగొన్న లేఖ గురించి న్యాయమూర్తి ప్రస్తావించారు. విధులకు త్వరగా రమ్మన్నందుకు డ్రైవర్ తీవ్రంగా కొట్టాడని లేఖలో ఉందని గుర్తుచేశారు. అందులోని చేతిరాత మృతుడిదేనని మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నిపుణులు తేల్చారన్నారు. అయితే రెండో అభిప్రాయం కోసం లేఖను హైదరాబాద్‌ సీఎఫ్​ఎస్​ఎల్​కు పంపారన్నారు. డ్రైవర్ ప్రసాద్ ఇప్పటికీ వివేకా కుటుంబసభ్యుల వద్దే పనిచేస్తుండటం, ఆయనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయకపోవడం చూస్తుంటే... హత్యకు కారణమైనవారే కేసును పక్కదోవ పట్టించేందుకు మృతుడితో బలవంతంగా లేఖ రాయించి ఉండొచ్చని కోర్టు సందేహం వ్యక్తంచేసింది.

ఆర్థిక, వ్యక్తిగత, రాజకీయ సంబంధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని, పలువుర్ని విచారించామని సిట్ చెబుతున్నప్పటికీ... ఇప్పటి వరకు ఘటనతో నేరుగా సంబంధం ఉన్న ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడింది. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న కె.శ్రీనివాసరెడ్డి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక గుట్టు రట్టు కాకుండా తప్పించారా అనే విషయం వెల్లడికావాల్సి ఉందని న్యాయమూర్తి అన్నారు. హత్యకేసు విచారణకు అదనపు డీజీ అమిత్‌గార్గ్‌ సారథ్యంలో మొదటి సిట్ ఏర్పాటుచేయగా.... కడప ఎస్పీ నేతృత్వంలో రెండో సిట్ నియమించిన విషయం హైకోర్టు ప్రస్తావించింది. మొదటి సిట్‌కి సారథ్యం వహించిన అదనపు డీజీకి.... రెండో సిట్‌లో స్థానం కల్పించలేదుని గుర్తుచేసింది. 2019 అక్టోబర్ 16న కడప ఎస్పీ 8 పోలీసు బృందాల్ని ఏర్పాటుచేశారని... అయినా ఇప్పటివరకు హత్య కేసు మిస్టరీ మాత్రం వీడలేదని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

నేరగాళ్లకు శిక్షపడేలా చూడాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మృతుడు వివేకానందరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి చిన్నాన్న అనే విషయం ప్రస్తావించింది. హత్య జరిగిన కొన్ని రోజులకే సీబీఐకి దర్యాప్తు అప్పగించాలంటూ ప్రతిపక్షనేతగా జగన్‌ వ్యాజ్యం దాఖలు చేశారని..ఆ వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదంటూ ముఖ్యమంత్రిగా కోర్టులో మెమో వేశారని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు దుర్వినియోగం కాదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ... ఈ వ్యవహారం తుదిదశకు చేరేవరకు నైతిక బాధ్యతను వదులుకోరాదని అభిప్రాయం వ్యక్తంచేసింది. కోర్టులో మెమో వేసే నాటికి రాష్ట్ర దర్యాప్తు ఏజెన్సీ ముఖ్యమంత్రి నియంత్రణలో ఉన్నప్పటికీ.... హత్య కేసులో నేరుగా పాత్ర ఉన్న ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదన్నది కఠోర సత్యమని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: వైఎస్​ వివేకానందరెడ్డికి ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.