కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. వివిధ శాఖల్లో ఒప్పంద సిబ్బంది వివరాల నమోదుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైద్యారోగ్యం, స్త్రీ, శిశు సంక్షేమం శాఖలో ఒప్పంద సిబ్బంది వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. విద్యాశాఖ, అటవీ, గిరిజన సంక్షేమం, న్యాయ శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు తీసుకుంటున్నారు. ఆయా శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు..తర్వాత సీఎస్తో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉన్నతస్థాయిలో సమావేశ నిర్ణయాలను మంత్రుల కమిటీకి ప్రభుత్వం నివేదించింది.
ఇవీ చదవండి: పథకాలు మావి... పేర్లు మీవా: ధూళిపాళ్ల నరేంద్ర