నౌకాదళ సేవల నుంచి వైదొలిగిన ఐఎన్ఎస్ విరాట్ను ఒడ్డుకు రప్పించేందుకు చేసిన ప్రణాళికలపై.. రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసింది. సేవల నుంచి వైదొలగిన యుద్ధనౌకను.. ఒడ్డుకు తీసుకువచ్చి మ్యూజియంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు డీపీఆర్ రూపకల్పన కోసం పర్యాటక శాఖ.. ముంబైకి చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతల్ని అప్పగించింది.
కేవలం కన్సల్టెన్సీ సేవల కోసమే.. రూ. 70.80 లక్షలను చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముంబై తీరం నుంచి ఈ నౌకను విశాఖకు తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చేందుకు.. భారీ మొత్తంలో ఖర్చవుతుందని తెలుసుకున్న ప్రభుత్వం.. ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
ఇదీ చదవండి: