విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే విస్తరణకు గన్నవరం మండలం దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 50 ఎకరాల భూమిని సేకరించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ ప్యాకేజీని రద్దు చేసి 5 సెంట్ల స్థలానికి బదులు సెంటున్నర ఇస్తామని చెప్పడంతో బాధితులు ప్రభుత్వం సేకరించిన స్థలం వద్ద ఆందోళనకు దిగారు. 5 సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద సుమారు 300 కుటుంబాల నుంచి గత ప్రభుత్వం భూమిని సేకరించింది.
ఇదీ చదవండి : 'జగన్ కేబినెట్ మంత్రులంతా డమ్మీలు '