లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు.. ప్రముఖులు ముందుకొస్తున్నారు. గంగవరం పోర్టు ఛైర్మన్ డీవీఎస్ రాజు, ఆయన కుమారుడు పోర్టు ఎండీ రాజగోపాల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ద్వారా సీఎం కేసీఆర్కు అందించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా ఏకంకావాల్సిన పరిస్థితి వచ్చిందని డీవీఎస్ రాజు పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో అందరూ ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ సీఎం సహాయనిధికి గంగవరం పోర్టు ఛైర్మన్ భారీ విరాళం - తెలంగాణకు గంగవరం పోర్టు ఛైర్మన్ విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు చేయూత ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గంగవరం పోర్టు ఛైర్మన్ డీవీఎస్ రాజు రూ.కోటి విరాళం అందించారు.

లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు.. ప్రముఖులు ముందుకొస్తున్నారు. గంగవరం పోర్టు ఛైర్మన్ డీవీఎస్ రాజు, ఆయన కుమారుడు పోర్టు ఎండీ రాజగోపాల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ద్వారా సీఎం కేసీఆర్కు అందించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా ఏకంకావాల్సిన పరిస్థితి వచ్చిందని డీవీఎస్ రాజు పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో అందరూ ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు.
ఇదీ చూడండి: సీఎం సహాయ నిధికి నవయుగ సంస్థ విరాళం రూ. కోటి