ETV Bharat / city

లలితా త్రిపుర సుందరీ దేవిగా బెజవాడ దుర్గమ్మ - విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలు

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడ దుర్గమ్మ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ చక్ర అధిష్ఠాన శక్తిగా.. పంచద శాక్షరీ మహా మంత్రాభినేత్రిగా.. జగన్మాత భక్తులను ఆశీర్వదించింది.

durga temple
durga temple
author img

By

Published : Oct 22, 2020, 8:14 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చింది. శ్రీ చక్ర అధిష్ఠాన శక్తిగా పంచద శాక్షరీ మహా మంత్రాభినేత్రిగా.. జగన్మాత భక్తలను ఆశీర్వదించింది.

శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిద్విలాసంతో అమ్మవారు సాక్షాత్కరించింది. అమ్మవారి దివ్య రూపాన్ని తిలకించేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా.. గంటకు వెయ్యి మంది చొప్పున రోజుకు పదివేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్ర వాహర్చణ తదితర పూజలు నిర్వహించారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చింది. శ్రీ చక్ర అధిష్ఠాన శక్తిగా పంచద శాక్షరీ మహా మంత్రాభినేత్రిగా.. జగన్మాత భక్తలను ఆశీర్వదించింది.

శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిద్విలాసంతో అమ్మవారు సాక్షాత్కరించింది. అమ్మవారి దివ్య రూపాన్ని తిలకించేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా.. గంటకు వెయ్యి మంది చొప్పున రోజుకు పదివేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్ర వాహర్చణ తదితర పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి: బాలకృష్ణ 'నర్తనశాల' ట్రైలర్ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.