ETV Bharat / city

'రాష్ట్రవ్యాప్తంగా 254 ఔషధ దుకాణాలపై దాడులు'

కరోనా వైరస్ వ్యాప్తి కలకలంతో మాస్క్​ ధరలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 254 ఔషద దుకాణాలపై ఔషద నియంత్రణ పరిపాలన శాఖ అధికారులు దాడులు చేశారు. మాస్క్​లను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలపై వేటు తప్పదని హెచ్చరించారు.

author img

By

Published : Mar 6, 2020, 7:30 AM IST

'రాష్ట్రవ్యాప్తంగా 254 ఔషధ దుకాణాలపై దాడులు'
'రాష్ట్రవ్యాప్తంగా 254 ఔషధ దుకాణాలపై దాడులు'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్​ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అధిక ధరలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 254 మందుల దుకాణాలపై ఔషద నియంత్రణ పరిపాలన శాఖాధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 2లక్షల వరకు రకారకాల మాస్కులను, ఎన్ 95 మాస్కులు 2,800 వరకు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలులోని శ్రీమౌర్య మెడికల్ షాపులో 20 రూపాయల మాస్క్​ను 30 రూపాయలకు విక్రయించటంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.మందుల ఉత్పత్తి, పంపిణీదారులు, విక్రయదారులు నిబంధలను వ్యతిరేకించినట్లయితే 0863 - 2339246 , 9490153357 నెంబర్లకు సమాచారమివ్వాలని కోరారు.

సెంట్రల్ మానిటరింగ్ యూనిట్

మందుల లభ్యత, ఇతర అంశాలు పరిశీలించేందుకు సెంట్రల్ మానిటరింగ్ యూనిట్​ను ఏర్పాటు చేసినట్లు ఔషద నియంత్రణ పరిపాలనా శాఖ అధికారి మల్లిఖార్జున వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 58 రకాల మందుల తయారీకి సంబంధించిన ముడిసరకు పరంగా ఎటువంటి సమస్యలు లేవన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు మందులు అందుబాటులోనే ఉంటాయన్నారు. దేశ అవసరాలకు తగ్గట్లు మందులు అందుబాటులో ఉంటున్నాయా ? లేవా ? అన్న దానిపై పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్రం దృష్టిసారిస్తుందన్నారు.

ఇవీ చదవండి

'రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్​ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అధిక ధరలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 254 మందుల దుకాణాలపై ఔషద నియంత్రణ పరిపాలన శాఖాధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 2లక్షల వరకు రకారకాల మాస్కులను, ఎన్ 95 మాస్కులు 2,800 వరకు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలులోని శ్రీమౌర్య మెడికల్ షాపులో 20 రూపాయల మాస్క్​ను 30 రూపాయలకు విక్రయించటంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.మందుల ఉత్పత్తి, పంపిణీదారులు, విక్రయదారులు నిబంధలను వ్యతిరేకించినట్లయితే 0863 - 2339246 , 9490153357 నెంబర్లకు సమాచారమివ్వాలని కోరారు.

సెంట్రల్ మానిటరింగ్ యూనిట్

మందుల లభ్యత, ఇతర అంశాలు పరిశీలించేందుకు సెంట్రల్ మానిటరింగ్ యూనిట్​ను ఏర్పాటు చేసినట్లు ఔషద నియంత్రణ పరిపాలనా శాఖ అధికారి మల్లిఖార్జున వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 58 రకాల మందుల తయారీకి సంబంధించిన ముడిసరకు పరంగా ఎటువంటి సమస్యలు లేవన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు మందులు అందుబాటులోనే ఉంటాయన్నారు. దేశ అవసరాలకు తగ్గట్లు మందులు అందుబాటులో ఉంటున్నాయా ? లేవా ? అన్న దానిపై పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్రం దృష్టిసారిస్తుందన్నారు.

ఇవీ చదవండి

'రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.