ETV Bharat / city

Ramakrisha: 'పంతానికి పోయి రాష్ట్రాల అధికారాలను కేంద్రానికి అప్పగిస్తున్నారు'

author img

By

Published : Jul 17, 2021, 9:10 PM IST

జలవివాదాలపై(water disputes) ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరిపై సీపీఐ నేత రామకృష్ణ(cpi leader ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతానికి పోయి రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని కేంద్రానికి అప్పగిస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాలువలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. జులై 19న విద్యార్థి, యువజన సంఘాలు‌ చేపట్టే ఆందోళనకు సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు.

సీపీఐ నేత రామకృష్ణ
సీపీఐ నేత రామకృష్ణ
సీపీఐ నేత రామకృష్ణ

పంతానికి పోయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రానికి అప్పగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల ఏర్పాటుకు జగన్ కృషి చేశారని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు... జల వివాదానికి కేంద్రమైన తెలంగాణ సీఎం కేసిఆర్​ను జగన్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. నదీ యాజమాన్య బోర్డులపై కేంద్రం గెజిట్​పై లేనిపోని వివాదాలు సృష్టించి.. అధికారాలను కేంద్రానికి కట్టబెట్టారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఒకరినొకరు సహకరించుకుంటూ, రైతులు, ప్రజల విషయంలో కొర్రీలు పెడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళనకు సీపీఐ మద్దతు...

తెదేపా, కాంగ్రెస్, వామపక్ష అనుబంధ‌ విద్యార్ధి, యువజన సంఘాల ప్రతినిధులతో సీపీఐ రామకృష్ణ విజయవాడలో సమావేశమయ్యారు. జాబ్ క్యాలెండర్‌, ప్రభుత్వ విధానాల కు వ్యతిరేకంగా చేపట్టే కార్యాచరణపై చర్చించారు. జులై 19న విద్యార్థి, యువజన సంఘాలు‌ చేపట్టే ఆందోళనకు సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్... ‌జాబ్ లెస్ క్యాలెండర్​ను విడుదల చేస్తే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసంతో ఆందోళన చేసిన నిరుద్యోగులను అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు.

కొత్త జాబ్ క్యాలెండర్​ విడుదల చేయండి...

పాదయాత్ర, ఎన్నికల సమయంలో 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ వాస్తవం కాదా ఆని రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్​ను ప్రశ్నించారు. అవేవీ ఇవ్వకుండా ఆరు లక్షల ఉద్యోగులు ఇచ్చామని ప్రకటనలు ఇవ్వడం దారుణమని అన్నారు. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి జగన్ మరో ప్రకటన విడుదల చేయాలని,.. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరో వైపు 19న తలపెట్టిన సీఎం నివాసం ముట్టడికి అన్ని పక్షాల మద్దతు ఉందని తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు తెలిపారు.

కేసులు పెట్టడం తగదు...

ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు... ఉద్యోగాల భర్తీకి అన్ని శాఖల్లోని ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. విజయవాడ విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యోగాల భర్తీకై చేపట్టిన ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయమని అడిగితే కేసులు పెట్టడం తగదన్నారు. తక్షణమే వారిపై పెట్టిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీచదవండి.

Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం

Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా'

Narappa: ''నారప్ప' ఓటీటీ విడుదల అందువల్లే''

శాంతించిన కెప్టెన్​.. సిద్ధూకే పంజాబ్​ పగ్గాలు!

సీపీఐ నేత రామకృష్ణ

పంతానికి పోయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రానికి అప్పగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల ఏర్పాటుకు జగన్ కృషి చేశారని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు... జల వివాదానికి కేంద్రమైన తెలంగాణ సీఎం కేసిఆర్​ను జగన్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. నదీ యాజమాన్య బోర్డులపై కేంద్రం గెజిట్​పై లేనిపోని వివాదాలు సృష్టించి.. అధికారాలను కేంద్రానికి కట్టబెట్టారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఒకరినొకరు సహకరించుకుంటూ, రైతులు, ప్రజల విషయంలో కొర్రీలు పెడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళనకు సీపీఐ మద్దతు...

తెదేపా, కాంగ్రెస్, వామపక్ష అనుబంధ‌ విద్యార్ధి, యువజన సంఘాల ప్రతినిధులతో సీపీఐ రామకృష్ణ విజయవాడలో సమావేశమయ్యారు. జాబ్ క్యాలెండర్‌, ప్రభుత్వ విధానాల కు వ్యతిరేకంగా చేపట్టే కార్యాచరణపై చర్చించారు. జులై 19న విద్యార్థి, యువజన సంఘాలు‌ చేపట్టే ఆందోళనకు సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్... ‌జాబ్ లెస్ క్యాలెండర్​ను విడుదల చేస్తే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసంతో ఆందోళన చేసిన నిరుద్యోగులను అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు.

కొత్త జాబ్ క్యాలెండర్​ విడుదల చేయండి...

పాదయాత్ర, ఎన్నికల సమయంలో 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ వాస్తవం కాదా ఆని రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్​ను ప్రశ్నించారు. అవేవీ ఇవ్వకుండా ఆరు లక్షల ఉద్యోగులు ఇచ్చామని ప్రకటనలు ఇవ్వడం దారుణమని అన్నారు. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి జగన్ మరో ప్రకటన విడుదల చేయాలని,.. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరో వైపు 19న తలపెట్టిన సీఎం నివాసం ముట్టడికి అన్ని పక్షాల మద్దతు ఉందని తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు తెలిపారు.

కేసులు పెట్టడం తగదు...

ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు... ఉద్యోగాల భర్తీకి అన్ని శాఖల్లోని ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. విజయవాడ విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యోగాల భర్తీకై చేపట్టిన ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయమని అడిగితే కేసులు పెట్టడం తగదన్నారు. తక్షణమే వారిపై పెట్టిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీచదవండి.

Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం

Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా'

Narappa: ''నారప్ప' ఓటీటీ విడుదల అందువల్లే''

శాంతించిన కెప్టెన్​.. సిద్ధూకే పంజాబ్​ పగ్గాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.