ETV Bharat / city

'టిడ్కో ఇళ్లు కేటాయించే వరకు నిరసనలు కొనసాగుతాయి'

author img

By

Published : Dec 5, 2020, 3:51 PM IST

టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించే వరకు నిరసన చేపడతామని విజయవాడ సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. ఈనెల 11న లబ్ధిదారులతో కలిసి దాసరి భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

cpi demands to give tidco houses to  Beneficiaries
విజయవాడ సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్

ప్రభుత్వం డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని విజయవాడ సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం లబ్ధిదారులను స్కీముల పేరుతో అయోమయానికి గురి చేస్తుందన్నారు. డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించే వరకు సీపీఐ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. ఈనెల 11న లబ్ధిదారులతో కలిసి దాసరి భవన్ నుంచి కలెక్టరేట్​ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అందరూ పాల్గొనాలని కోరారు.

ప్రభుత్వం డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని విజయవాడ సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం లబ్ధిదారులను స్కీముల పేరుతో అయోమయానికి గురి చేస్తుందన్నారు. డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించే వరకు సీపీఐ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. ఈనెల 11న లబ్ధిదారులతో కలిసి దాసరి భవన్ నుంచి కలెక్టరేట్​ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అందరూ పాల్గొనాలని కోరారు.

ఇదీ చదవండి: లోక్​సభలో వైకాపా తీరు.. రైతు ద్రోహమే: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.