ETV Bharat / city

కరోనా బాధితులను బెంబేలెత్తిస్తున్న బెజవాడ ఆసుపత్రి

author img

By

Published : Jul 26, 2020, 7:28 AM IST

విజయవాడలోని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి కరోనా బాధితులను భయపెడుతోంది. నిత్యం భారీ సంఖ్యలో రోగులు వస్తుండటంతో సత్వర వైద్యం అందడం లేదు. ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో వైరస్ పీడితులు మృత్యువాత పడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

vijayawada ggh
vijayawada ggh

కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. 60 ఏళ్లు పైబడినవాళ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సహాయం అవసరమైన వారినే ఇక్కడికి ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఆసుపత్రిలో 500కు పైగా మంచాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కేసులు ఉద్ధృతంగా నమోదవుతుండటంతో చాలావరకు మంచాలు నిండిపోయాయి. ఆసుపత్రి ప్రాంగణంలోని సూపర్‌ స్పెషాలిటీ సహా అన్ని బ్లాక్‌లలోనూ వైద్యమందిస్తున్నారు. నిత్యం భారీ సంఖ్యలో రోగులు వస్తుండగా.. వారిలో అత్యవసర వైద్య సహాయం అవసరమున్నవాళ్లే అధికం. వచ్చే వారందరికీ వెంటనే వైద్యం అందించే పరిస్థితి లేదు. రోగులకు తగ్గట్లుగా వైద్య సిబ్బందీ లేరు. నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే అక్కడ పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడటంతో వార్డుల్లోకి వెళ్లేందుకే చాలామంది భయపడుతున్నట్లు సమాచారం. బంధువులకు రోగుల ఆరోగ్య సమాచారం ఇచ్చేవారే లేరు. ఆసుపత్రిలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసినా.. అక్కడ ఉదయం 11 నుంచి రెండింటి వరకే సమాచారమిస్తున్నారు. దీంతో రోగుల బంధువులకు, సిబ్బందికి వాగ్వాదాలు జరుగుతున్నాయి.

మానసికంగా తీవ్ర ఆందోళన..

'వార్డులో మా పక్కనే ఉన్న ఓ వ్యక్తి బాత్రూంకు వెళ్లి లోపల గడియపెట్టుకున్నారు. తిరిగి తెరిచేందుకు ఓపిక లేక అలాగే కూలబడిపోయారు' అని విజయవాడకు చెందిన ఓ బాధితుడు ‘ఈనాడు’కు ఫోన్‌లో తెలిపారు. తాజాగా మరో మహిళ వార్డులోనే వాంతులు చేసుకుంటూ మంచం పైనుంచి గచ్చుపైకి పడిపోయి చనిపోయారు. ఆసుపత్రిలో తమ పక్కనే ఉన్నవాళ్లు చనిపోతుండటంతో బాధితుల్లో మానసిక ఆందోళన పెరిగిపోతోంది. తమ వాళ్లకు ఫోన్లు చేసి ఈ విషయాలు చెబుతున్నారు. విజయవాడ ఆసుపత్రితో పోలిస్తే కృష్ణా జిల్లాలోని చినఅవుటపల్లి, ఇబ్రహీంపట్నంలలో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం సహా అన్నీ సమయానికి అందిస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు.

కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. 60 ఏళ్లు పైబడినవాళ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సహాయం అవసరమైన వారినే ఇక్కడికి ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఆసుపత్రిలో 500కు పైగా మంచాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కేసులు ఉద్ధృతంగా నమోదవుతుండటంతో చాలావరకు మంచాలు నిండిపోయాయి. ఆసుపత్రి ప్రాంగణంలోని సూపర్‌ స్పెషాలిటీ సహా అన్ని బ్లాక్‌లలోనూ వైద్యమందిస్తున్నారు. నిత్యం భారీ సంఖ్యలో రోగులు వస్తుండగా.. వారిలో అత్యవసర వైద్య సహాయం అవసరమున్నవాళ్లే అధికం. వచ్చే వారందరికీ వెంటనే వైద్యం అందించే పరిస్థితి లేదు. రోగులకు తగ్గట్లుగా వైద్య సిబ్బందీ లేరు. నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే అక్కడ పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడటంతో వార్డుల్లోకి వెళ్లేందుకే చాలామంది భయపడుతున్నట్లు సమాచారం. బంధువులకు రోగుల ఆరోగ్య సమాచారం ఇచ్చేవారే లేరు. ఆసుపత్రిలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసినా.. అక్కడ ఉదయం 11 నుంచి రెండింటి వరకే సమాచారమిస్తున్నారు. దీంతో రోగుల బంధువులకు, సిబ్బందికి వాగ్వాదాలు జరుగుతున్నాయి.

మానసికంగా తీవ్ర ఆందోళన..

'వార్డులో మా పక్కనే ఉన్న ఓ వ్యక్తి బాత్రూంకు వెళ్లి లోపల గడియపెట్టుకున్నారు. తిరిగి తెరిచేందుకు ఓపిక లేక అలాగే కూలబడిపోయారు' అని విజయవాడకు చెందిన ఓ బాధితుడు ‘ఈనాడు’కు ఫోన్‌లో తెలిపారు. తాజాగా మరో మహిళ వార్డులోనే వాంతులు చేసుకుంటూ మంచం పైనుంచి గచ్చుపైకి పడిపోయి చనిపోయారు. ఆసుపత్రిలో తమ పక్కనే ఉన్నవాళ్లు చనిపోతుండటంతో బాధితుల్లో మానసిక ఆందోళన పెరిగిపోతోంది. తమ వాళ్లకు ఫోన్లు చేసి ఈ విషయాలు చెబుతున్నారు. విజయవాడ ఆసుపత్రితో పోలిస్తే కృష్ణా జిల్లాలోని చినఅవుటపల్లి, ఇబ్రహీంపట్నంలలో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం సహా అన్నీ సమయానికి అందిస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి

గుంటూరు సర్వజనాస్పత్రిలో సత్వర స్పందన కరవు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.