ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 4,622 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Oct 13, 2020, 6:08 PM IST

Updated : Oct 13, 2020, 6:54 PM IST

రాష్ట్రంలో కొత్తగా 4,622 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 4,622 కరోనా కేసులు నమోదు

18:05 October 13

వైరస్ కారణంగా 35 మంది మృతి

రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 72,082 నమూనాలను పరీక్షించగా 4,622 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,63,573కి చేరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో వైరస్ కారణంగా 35 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 5, కడప 4, ప్రకాశం 4, అనంతపురం 3, గుంటూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.  ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,291కి చేరింది. ఒక్కరోజులో 5,715 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. 42,855 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా  67,02,810 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: 

రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

18:05 October 13

వైరస్ కారణంగా 35 మంది మృతి

రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 72,082 నమూనాలను పరీక్షించగా 4,622 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,63,573కి చేరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో వైరస్ కారణంగా 35 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 5, కడప 4, ప్రకాశం 4, అనంతపురం 3, గుంటూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.  ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,291కి చేరింది. ఒక్కరోజులో 5,715 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. 42,855 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా  67,02,810 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: 

రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Last Updated : Oct 13, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.