ETV Bharat / city

'ఇంట్లోనే ఉండండి.. వైరస్ వ్యాప్తిని అరికట్టండి'

author img

By

Published : May 9, 2020, 12:27 PM IST

కృష్ణా జిల్లా విజయవాడలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రెడ్ జోన్ గా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఎవరినీ బయటకు రాకుండా చూస్తున్నారు. వారికి ఏమైనా అవసరమైతే వాలంటీర్ల ద్వారా సహాయం అందిస్తామని సూచిస్తున్నారు.

corona cases in vijayawada
corona cases in vijayawada

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, లూనా సెంటర్ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ కారణంగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయాన్నే రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు.. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఎవరికైనా నిత్యావసర వస్తువులు కావల్సి వస్తే.. స్థానిక వాలంటీర్లకు సమాచారం అందించాలని సూచించారు. కొంతకాలం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మైకుల ద్వారా స్థానికులకు ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, లూనా సెంటర్ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ కారణంగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయాన్నే రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు.. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఎవరికైనా నిత్యావసర వస్తువులు కావల్సి వస్తే.. స్థానిక వాలంటీర్లకు సమాచారం అందించాలని సూచించారు. కొంతకాలం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మైకుల ద్వారా స్థానికులకు ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

ఇవీ చదవండి:

కొన్ని నెలల్లో కరోనా మహమ్మారికి టీకా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.