ETV Bharat / city

భాజపా కుట్రలకు వైకాపా, తెదేపా మద్దతిస్తున్నాయి: శైలజానాథ్

కేంద్రంలో భాజపా చేస్తున్న కుట్రలకు రాష్ట్రంలోని వైకాపా, తెదేపాలు మద్దతిస్తున్నాయని.. ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. రైతులను పరాధీనులుగా మార్చే కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు.

author img

By

Published : Sep 21, 2020, 4:13 PM IST

congress leader sailajanath about on agriculture bills
శైలజానాథ్, ఏపీసీసీ అధ్యక్షులు

రాష్ట్రంలోని వైకాపా, తెదేపా.. కేంద్రంలో భాజపాకు ఏ,బీ గ్రూప్ పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ ఆరోపించారు. భాజపా, ఆర్​ఎస్​ఎస్​​లు భారతదేశ రైతాంగాన్ని పరాధీనులుగా మార్చే కుట్రలు చేస్తున్నాయని.. వాటికి ఈ రెండు పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు.

పంపు సెట్లకు విద్యుత్ మీటర్లను అమర్చడం, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేలా సంస్కరణల పేరుతో వ్యవసాయ బిల్లులను తీసుకురావడం ఈ కుట్రలో భాగమే అని ఘాటు విమర్శలు చేశారు. వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారని విమర్శించారు. బిల్లులకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టామన్నారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని.. వారి ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

దేశంలో రైతులను పరాధీనులుగా మార్చే కుట్ర జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు కార్పొరేట్ వ్యవస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయి. వాటిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలకు వైకాపా, తెదేపాలు మద్దతిస్తున్నాయి. -- శైలజానాథ్, ఏపీసీసీ అధ్యక్షులు

ఇవీ చదవండి...

'సాహిత్యంతో సమాజాన్ని సంస్కరించవచ్చని గురజాడ నిరూపించారు'

రాష్ట్రంలోని వైకాపా, తెదేపా.. కేంద్రంలో భాజపాకు ఏ,బీ గ్రూప్ పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ ఆరోపించారు. భాజపా, ఆర్​ఎస్​ఎస్​​లు భారతదేశ రైతాంగాన్ని పరాధీనులుగా మార్చే కుట్రలు చేస్తున్నాయని.. వాటికి ఈ రెండు పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు.

పంపు సెట్లకు విద్యుత్ మీటర్లను అమర్చడం, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేలా సంస్కరణల పేరుతో వ్యవసాయ బిల్లులను తీసుకురావడం ఈ కుట్రలో భాగమే అని ఘాటు విమర్శలు చేశారు. వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారని విమర్శించారు. బిల్లులకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టామన్నారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని.. వారి ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

దేశంలో రైతులను పరాధీనులుగా మార్చే కుట్ర జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు కార్పొరేట్ వ్యవస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయి. వాటిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలకు వైకాపా, తెదేపాలు మద్దతిస్తున్నాయి. -- శైలజానాథ్, ఏపీసీసీ అధ్యక్షులు

ఇవీ చదవండి...

'సాహిత్యంతో సమాజాన్ని సంస్కరించవచ్చని గురజాడ నిరూపించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.