ETV Bharat / city

మోదీ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోంది: గిడుగు రుద్రరాజు

author img

By

Published : Dec 11, 2020, 5:02 PM IST

దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీదకు వచ్చేలా చేసిందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు విమర్శించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని తెలిపిన ఆయన...వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోంది
ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోంది

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను రోడ్డుమీదకు వచ్చేలా చేశారన్నారు. లోక్​సభ, రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపిన వైకాపా, తెదేపాలు బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. భాజపాతో కలిసిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్ రైతులపక్షాన దీక్ష చేయటంపై ఆయన మండిపడ్డారు.

రైతు ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని రుద్రరాజు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను రోడ్డుమీదకు వచ్చేలా చేశారన్నారు. లోక్​సభ, రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపిన వైకాపా, తెదేపాలు బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. భాజపాతో కలిసిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్ రైతులపక్షాన దీక్ష చేయటంపై ఆయన మండిపడ్డారు.

రైతు ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని రుద్రరాజు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

చర్చలపై రైతులకు మరోమారు కేంద్రం విజ్ఞప్తి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.