ETV Bharat / city

ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు: సీఎం జగన్

author img

By

Published : Apr 12, 2022, 4:19 PM IST

Updated : Apr 13, 2022, 5:39 AM IST

ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను అవసరమైతే ఇంకా పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకూ.. ప్రతిభ ఆధారంగా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను జగన్‌ పరిశీలించారు.

ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు
ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను జగన్‌ పరిశీలించారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం.. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వాటి ద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించటంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వైద్య రంగంలో చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేశామన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్య ఆసరా కింద రోగులకు..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను కూడా గణనీయంగా పెంచామన్నారు. అనుభవం, సమర్థత ఉన్న అధికారులను విద్య, వైద్య శాఖలకు అప్పగించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా తాను లక్ష్యాలను నిర్దేశిస్తానని.., వాటిని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలన్నారు. శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది లక్ష్యాలను ఛాలెంజ్​గా స్వీకరించాలన్నారు. ఆశించిన మార్పుల సాధనకు, లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్‌గా పనిచేయాలని సీఎం సూచించారు.

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపైనా సీఎం జగన్ ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని తెలిపారు. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్యుల సేవలు తప్పక అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైద్యుల జీతాలు పెంచామన్నారు. అందుకే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామన్నారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు, విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌ కాలేజీల నిర్మాణంపైనా సీఎం సమీక్షించారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దని..,వసతులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రానివ్వొద్దన్నారు.

మే 15 నాటికల్లా పెండింగ్​లో ఉన్న మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్లు అవుతుందన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి ఆరోజున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం సూచించారు.

12-14 ఏళ్ల వారిలో తొలి డోసు 94.47% పూర్తి!
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.13 శాతానికి తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిందని తెలిపారు. 15-17 ఏళ్ల మధ్యవారికి 100% రెండు డోసుల పంపిణీ పూర్తయిందని చెప్పారు. 12-14 ఏళ్ల మధ్యవారిలో 94.47% మందికి మొదటి డోసు పంపిణీ పూర్తయిందని చెప్పారు. పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ ప్రగతి గురించి సీఎంకు అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం వైద్య కళాశాలల నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో వినయ్‌చంద్‌, ఏపీ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు అనుబంధ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేయనున్న సమాచార కియోస్క్‌ నమూనాను సీఎం పరిశీలించారు. వైద్య సేవల వివరాలను సైన్‌బోర్డుల రూపంలో ఆస్పత్రుల్లో ఏర్పాటుచేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: Venugopala Krishna: 'సీఎంను ఆరాధిస్తే... తప్పక ఇళ్ల స్థలాలు వస్తాయి'

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను జగన్‌ పరిశీలించారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం.. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వాటి ద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించటంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వైద్య రంగంలో చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేశామన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్య ఆసరా కింద రోగులకు..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను కూడా గణనీయంగా పెంచామన్నారు. అనుభవం, సమర్థత ఉన్న అధికారులను విద్య, వైద్య శాఖలకు అప్పగించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా తాను లక్ష్యాలను నిర్దేశిస్తానని.., వాటిని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలన్నారు. శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది లక్ష్యాలను ఛాలెంజ్​గా స్వీకరించాలన్నారు. ఆశించిన మార్పుల సాధనకు, లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్‌గా పనిచేయాలని సీఎం సూచించారు.

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపైనా సీఎం జగన్ ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని తెలిపారు. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్యుల సేవలు తప్పక అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైద్యుల జీతాలు పెంచామన్నారు. అందుకే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామన్నారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు, విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌ కాలేజీల నిర్మాణంపైనా సీఎం సమీక్షించారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దని..,వసతులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రానివ్వొద్దన్నారు.

మే 15 నాటికల్లా పెండింగ్​లో ఉన్న మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్లు అవుతుందన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి ఆరోజున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం సూచించారు.

12-14 ఏళ్ల వారిలో తొలి డోసు 94.47% పూర్తి!
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.13 శాతానికి తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిందని తెలిపారు. 15-17 ఏళ్ల మధ్యవారికి 100% రెండు డోసుల పంపిణీ పూర్తయిందని చెప్పారు. 12-14 ఏళ్ల మధ్యవారిలో 94.47% మందికి మొదటి డోసు పంపిణీ పూర్తయిందని చెప్పారు. పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ ప్రగతి గురించి సీఎంకు అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం వైద్య కళాశాలల నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో వినయ్‌చంద్‌, ఏపీ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు అనుబంధ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేయనున్న సమాచార కియోస్క్‌ నమూనాను సీఎం పరిశీలించారు. వైద్య సేవల వివరాలను సైన్‌బోర్డుల రూపంలో ఆస్పత్రుల్లో ఏర్పాటుచేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: Venugopala Krishna: 'సీఎంను ఆరాధిస్తే... తప్పక ఇళ్ల స్థలాలు వస్తాయి'

Last Updated : Apr 13, 2022, 5:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.