ETV Bharat / city

రుణం ఎగవేత కేసులో.. బ్యాంకు మేనేజర్​పై ఈడీ ఛార్జ్​షీట్ - రుణం ఎగవేత కేసులో బ్యాంకు మేనేజర్​పై ఈడీ ఛార్జ్​షీట్ వార్తలు

కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) రుణం ఎగవేత కేసులో బ్యాంకు మాజీ మేనేజర్​తోపాటు రుణం పొందిన సంస్థ ఎండీపై ఈడీ ఛార్జ్​షీట్ నమోదు చేసింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ఉద్దేశించిన పనికి వినియోగించకుండా ఓ సినిమాకు పెట్టుబడులుగా పెట్టారని ఈడీ పేర్కొంది.

రుణం ఎగవేత కేసులో బ్యాంకు మేనేజర్​పై ఈడీ ఛార్జ్​షీట్
రుణం ఎగవేత కేసులో బ్యాంకు మేనేజర్​పై ఈడీ ఛార్జ్​షీట్
author img

By

Published : May 11, 2022, 6:38 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) నుంచి లోన్ తీసుకుని ఎగవేసిన కేసులో బ్యాంకు మాజీ మేనేజర్ ఎస్.రామచంద్రరావు, వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఎండీ నిమ్మగడ్డ రామకృష్ణలపై ఈడీ ఛార్జ్​షీట్ నమోదు చేసింది. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.36.97 కోట్ల రుణాన్ని ఉద్దేశించిన పనికి వినియోగించకుండా ఓ సినిమాకు పెట్టుబడులుగా పెట్టారన్నారు. అనంతరం రుణం తిరిగి చెల్లించకపోవటంతో వడ్డీతో కలుపుకొని రూ.54.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఈడీ పేర్కొంది. నగదు అక్రమ రవాణా నివారణ చట్టానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్న ప్రత్యేక కోర్టులో ఛార్జ్​షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది.

కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) నుంచి లోన్ తీసుకుని ఎగవేసిన కేసులో బ్యాంకు మాజీ మేనేజర్ ఎస్.రామచంద్రరావు, వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఎండీ నిమ్మగడ్డ రామకృష్ణలపై ఈడీ ఛార్జ్​షీట్ నమోదు చేసింది. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.36.97 కోట్ల రుణాన్ని ఉద్దేశించిన పనికి వినియోగించకుండా ఓ సినిమాకు పెట్టుబడులుగా పెట్టారన్నారు. అనంతరం రుణం తిరిగి చెల్లించకపోవటంతో వడ్డీతో కలుపుకొని రూ.54.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఈడీ పేర్కొంది. నగదు అక్రమ రవాణా నివారణ చట్టానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్న ప్రత్యేక కోర్టులో ఛార్జ్​షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది.

ఇవీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.