ETV Bharat / city

నాయిని మరణం కార్మిక లోకానికి తీరనిలోటు: చంద్రబాబు - నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల లోకేశ్ సంతాపం

తెలంగాణ మాజీ హోంమంత్రి, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​లు విచారం వ్యక్తంచేశారు. ఆయన మృతి కార్మిక లోకానికి తీరని లోటని అన్నారు. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

chandrababu
చంద్రబాబు
author img

By

Published : Oct 22, 2020, 2:25 PM IST

తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, జీవితాంతం కార్మికులకు అండగా నిలిచి సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి మరణం విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మరణం కార్మిక లోకానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలంగాణ మాజీ హోం మంత్రి, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ప్రజల కోసం, కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొని యువ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నిబద్దత కలిగిన నాయకుడిని తెలుగువారు కోల్పోయారని పేర్కొన్నారు. నర్సింహారెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, జీవితాంతం కార్మికులకు అండగా నిలిచి సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి మరణం విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మరణం కార్మిక లోకానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలంగాణ మాజీ హోం మంత్రి, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ప్రజల కోసం, కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొని యువ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నిబద్దత కలిగిన నాయకుడిని తెలుగువారు కోల్పోయారని పేర్కొన్నారు. నర్సింహారెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి..

'అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే.. పండుగ వాతావరణం ఉండేది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.