ETV Bharat / city

'మానవ హక్కుల దినోత్సవం రోజైనా బాధితులకు న్యాయం జరగాలి'

author img

By

Published : Dec 10, 2020, 5:44 PM IST

మానవ హక్కుల దినోత్సవం రోజైనా బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్​కు లేఖ రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావట్లేదనటానికి కడప జిల్లాలో ఎస్సీ మహిళపై హత్యాచార ఘటన ఓ ఉదాహరణగా పేర్కొన్నారు.

'మానవ హక్కుల దినోత్సవం రోజైనా బాధితులకు న్యాయం జరగాలి'
'మానవ హక్కుల దినోత్సవం రోజైనా బాధితులకు న్యాయం జరగాలి'

కడప జిల్లాలో హత్యాచారానికి గురైన ఎస్సీ మహిళకు న్యాయం జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే ఎఫ్.ఐ.ఆర్​లో గుర్తుతెలియని వ్యక్తులు అని నమోదు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ తరహా వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్న చంద్రబాబు.., అధికార పార్టీ అండతో ఎస్సీలు, ఆదివాసులు, మైనార్టీ మహిళలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న చంద్రబాబు.. సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

కడప జిల్లాలో హత్యాచారానికి గురైన ఎస్సీ మహిళకు న్యాయం జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే ఎఫ్.ఐ.ఆర్​లో గుర్తుతెలియని వ్యక్తులు అని నమోదు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ తరహా వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్న చంద్రబాబు.., అధికార పార్టీ అండతో ఎస్సీలు, ఆదివాసులు, మైనార్టీ మహిళలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న చంద్రబాబు.. సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన​ భవనానికి శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.