ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవటాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చిత్రపటం మినహా ప్రధాని ఫొటో లేకపోవడంతో ఈ పథకానికి నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే విషయం తెలుసా ? అని నిలదీశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి.. ఆరోగ్య మిత్ర సిబ్బందితో మాట్లాడారు.
ఆయుష్మాన్ భారత్ కార్డులున్న వారికి అందిస్తోన్న వైద్య సేవల గురించి ప్రత్యేకంగా వివరాలు నమోదు చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. టెలీమెడిసిన్ సేవల గురించి ఆరా తీశారు. ఓ రోగితో నేరుగా టెలీమెడిసిన్ సౌకర్యంలో భాగంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిద్ధార్ధ మెడికల్ కళాశాలను మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తోన్న నిధులతో ఏయే వసతులు కల్పించారనే వివరాలపై ఆరా తీశారు.
ఇవీ చూడండి