ETV Bharat / city

పట్టాభిపై దాడి కేసు.. రెండు రోజుల్లో మిస్టరీ వీడే అవకాశం..! - attack on pattabh case investigation

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి కేసుకు సంబంధించి.. రెండు రోజుల్లో నిందితుల వివరాల వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

attack on pattabhi case going to reveal in two days
attack on pattabhi case going to reveal in two days
author img

By

Published : Feb 11, 2021, 8:33 PM IST

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలతో పాటు చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం ప్రాంతాల్లో దర్యాప్తు చేసి.. నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే... ఈ కేసులో పట్టాభిపై దాడి చేసిన నిందితుల్లో ఐదుగురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే దాడికి రాజకీయ కారణాలున్నాయా? వ్యక్తిగత కక్షలా? అనే అంశంపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. రెండురోజుల్లో దాడికి కారణాలు.. నిందితుల పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలతో పాటు చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం ప్రాంతాల్లో దర్యాప్తు చేసి.. నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే... ఈ కేసులో పట్టాభిపై దాడి చేసిన నిందితుల్లో ఐదుగురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే దాడికి రాజకీయ కారణాలున్నాయా? వ్యక్తిగత కక్షలా? అనే అంశంపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. రెండురోజుల్లో దాడికి కారణాలు.. నిందితుల పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఒడిశా పిటిషన్​పై రేపు అత్యవసర విచారణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.