ETV Bharat / city

New Judges to AP: ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం

author img

By

Published : Feb 10, 2022, 7:50 PM IST

Updated : Feb 11, 2022, 2:26 AM IST

ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం
ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం

19:48 February 10

ఆంధ్రప్రదేశ్​కు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

New Judges: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తల్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన వారు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్​ కుమార్ మిశ్ర.. వారిచే ప్రమాణం చేయించనున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయవాదులు కోటా నుంచి న్యాయమూర్తుల నియామకానికి ఏడు పేర్లను జనవరి 29 న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం నోటిపై చేయడంలో నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.

నేడు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణకు వీడ్కోలు

మరోవైపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ ఎం.వెంకటరమణతో కలుపుకొని ప్రస్తుతం 20 మంది న్యాయమూర్తులున్నారు. జస్టిస్ వెంకటరమణ పదవీ విరమణ తర్వాత కొత్తగా.. రాబోయే వారితో కలుపుకొని హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుతుంది.

ఇదీ చదవండి:

కొత్త జిల్లాల్లో.. ఉగాది నుంచే పాలన..!

19:48 February 10

ఆంధ్రప్రదేశ్​కు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

New Judges: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తల్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన వారు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్​ కుమార్ మిశ్ర.. వారిచే ప్రమాణం చేయించనున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయవాదులు కోటా నుంచి న్యాయమూర్తుల నియామకానికి ఏడు పేర్లను జనవరి 29 న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం నోటిపై చేయడంలో నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.

నేడు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణకు వీడ్కోలు

మరోవైపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ ఎం.వెంకటరమణతో కలుపుకొని ప్రస్తుతం 20 మంది న్యాయమూర్తులున్నారు. జస్టిస్ వెంకటరమణ పదవీ విరమణ తర్వాత కొత్తగా.. రాబోయే వారితో కలుపుకొని హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుతుంది.

ఇదీ చదవండి:

కొత్త జిల్లాల్లో.. ఉగాది నుంచే పాలన..!

Last Updated : Feb 11, 2022, 2:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.